- Home
- Entertainment
- విలన్ తో వర్షంలో రొమాన్స్, ఆ దరిద్రం వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ప్రగతి..ఆస్తులు ఎలా కోల్పోయిందో తెలుసా
విలన్ తో వర్షంలో రొమాన్స్, ఆ దరిద్రం వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ప్రగతి..ఆస్తులు ఎలా కోల్పోయిందో తెలుసా
నటి ప్రగతి తన ఆస్తులు, హీరోయిన్ గా కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రగతి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఒక్క సాంగ్ తన కెరీర్ లో మార్చేసిందో తెలిపారు.

నటి ప్రగతి
ప్రముఖ నటి ప్రగతి గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె రాణిస్తున్నారు. తల్లి, అత్త, అక్క, వదిన పాత్రల్లో ఆమెకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. సినిమాలతో కాకుండా జిమ్ వీడియోలతో సైతం ప్రగతి పాపులర్ అయింది. దాదాపు 5 పదుల వయసులో వెయిట్ లిఫ్టింగ్ తో కూడా ఆమె సత్తా చాటుతోంది.
హీరోయిన్ గా రాణించిన ప్రగతి
గతంలో ప్రగతి హీరోయిన్ గా కూడా రాణించారు. 90వ దశకంలో ఆమె హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించారు. తమిళ సినిమాలో సైతం ప్రగతి మెరిశారు. నటి ప్రగతి ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ గా ఆమె కెరీర్ త్వరగానే ముగిసిపోయింది. అలా ఎందుకు జరిగిందో ప్రగతి రివీల్ చేశారు.
విలన్ తో రొమాన్స్
1996లో వాజ్ఞ జననాయకం అనే సినిమాలో ప్రగతి, ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ జంటగా నటించారు. మన్సూర్ అలీ ఖాన్ ప్రస్తుతం విలన్ రోల్స్ చేస్తున్నారు. నెగిటివ్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆ మూవీలో నటి ప్రగతి, మన్సూర్ మధ్య రొమాంటిక్ రైన్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో ప్రగతి, మన్సూర్ రొమాన్స్ తో రెచ్చిపోయారు.
అందుకే హీరోయిన్ గా సినిమాలు ఆపేశా
ప్రగతి మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా చేసిన చివరి సినిమా అదే. ఆ రైన్ సాంగ్ వల్లే హీరోయిన్ గా సినిమాలు మానేశా. ఆ సాంగ్ చేస్తున్న టైంలో సెట్ లో ఒక వ్యక్తి నాతో దారుణంగా మాట్లాడాడు. అసలు వీడెవడు.. వీడి దగ్గర నేను ఎందుకు మాటలు పడాలి అని అనిపించింది. నేను ఎవరో జోలికి వెళ్ళను. నన్ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను అని ప్రగతి అన్నారు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని ప్రగతి తెలిపారు.
అందుకే ఆస్తులు కోల్పోయా
దశాబ్దాలుగా తాను సినిమా రంగంలో ఉన్నప్పటికీ తాను ఆస్తులు ఏమీ సంపాదించలేదు అని ప్రగతి అన్నారు. మీరు అనుకుంటున్నంత రిచ్ నేను కాదు. నాకు ముందు నుంచి డబ్బు విషయంలో ప్లానింగ్ లేదు. అప్పట్లో నాకున్న కమిట్మెంట్స్, ఇతర వ్యక్తుల వల్ల చాలా డబ్బు కోల్పోయాను అని ప్రగతి తెలిపింది.

