ఆ చెత్తను కడిగేయండి, ప్రజల సంగతి తర్వాత.....పవన్ పై మాధవీలత సంచలన పోస్ట్
నటి మాధవీలత పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సుదీర్ఘ సోషల్ మీడియా సందేశంలో ఆమె పవన్ పై అనేక విమర్శల బాణాలు వదిలారు. ముందు ఇంటిని చక్కడిదండి తరువాత ప్రజల కోసం ఆలోచిస్తుద్దురు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ సడన్ గా ఫ్లేట్ మార్చింది. పవన్ వీరాభిమాని కాస్త విమర్శకురాలిగా మారిపోయింది. ఓ సుదీర్ఘమైన సందేశంలో అనేక ప్రశ్నల బాణాలు పవన్ పై విసిరింది. పవన్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి మద్దతు తెలుపుతూ తన వీరాభిమానం చాటుకున్న మాధవి లత కోపానికి కారణం, ఆమెకు పవన్ రిప్లై ఇవ్వకాకపోవడమే.
సెప్టెంబర్ 2న పవన్ తన 49వ జన్మదినం జరుపుకున్నారు. దీనితో పవన్ అభిమానులతో పాటు, సినీ రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఇక పవన్ చాలా తీరిక చేసుకోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా నటి మాధవీలతకు మాత్రం పవన్ రిప్లై ఇవ్వలేదు. దీనికి మాధవీలత అనేక అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. నిజమైన అభిమానులకు కాకుండా ఎదో ప్రయోజనాలు ఆశించి విషెష్ చెప్పినవారికి మీరు రిప్లై ఇస్తారా అని ప్రశ్నించారు.
గత ఏడాది మీరు ఎన్నికలో పోటీచేస్తుంటే మీకు ఓటు వేయమని ఒక్కరైనా పోస్ట్ పెట్టారా, జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడారా అని అడిగారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే మీకు కొందరు బర్త్ డే విషెష్ చెప్పారు అన్నారు. వీలైతే మీకోసం నిజంగా పనిచేసిన జనసైనికుల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపండి అన్నారు.
అలాగే చిత్ర పరిశ్రమలో చాలా చెత్త ఉందని ముందు దానిని ప్రక్షాళన చేయండి తరువాత ప్రజల గురించి ఆలోచిస్తుద్దురు గాని అన్నారు. టాలీవుడ్ లో డ్రగ్స్, అమ్మాయిలకు వేధింపులు వంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటినిపై పోరాడండి. డ్రగ్స్ లేని భారత్ కోసం కృషి చేయండని ఘాటు విమర్శలు చేశారు.