లావణ్య త్రిపాఠి: లాక్లు ఎత్తేసింది..అందాలు ఆరబోసేసింది
లావణ్య త్రిపాఠి.. అతికొద్ది కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘అర్జున్ సురవరం’, వంటి హిట్ చిత్రాల్లో నటిగా వందకు వంద మార్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా సందీప్ కిషన్ హీరోగా హాకీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్ప్రెస్’ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం వరస సినిమా ఆఫర్స్ పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో హాట్ ఫొటోలను వరసపెట్టి వదులుతోంది. ఆ ఫొటోలలో కొన్నింటిని మీరు ఇక్కడ చూడవచ్చు.
కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రాజెక్ట్నల్లా ఓకే చేయడంతో వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో ఒక్కసారిగా రేసులో వెనక్కి వెళ్లిపోయింది.
మధ్యలో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. చాలా రోజుల వరకు ఒక్క హిట్ కూడా లేకపోవడం నిరాశ చెందింది.
చివరగా అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ విజయాన్ని దక్కించుకుంది. అలాగని మరీ సినిమాలు లేవని కావు. ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ఏవన్ ఎక్స్ప్రెస్ చిత్రంలో నటిస్తోంది.
అయితే ఈ బ్యూటీ ఎప్పుడూ పర్ఫార్మెన్స్కే ప్రాధాన్యత ఇవ్వడంతో అందాల ఆరబోతను పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఇకపై రొమాన్స్ కు దూరంగా ఉంటానని చెబుతుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.
తాజాగా నటి లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ లాక్ డౌన్ తరువాత షూటింగ్ లు మొదలు కానున్నాయి. కొన్ని భయాలు కూడా వెంటాడుతున్నాయి అంది.
లాక్డౌన్ తర్వాత షూటింగ్ చేయడం అనేది పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తాం. ఇక రొమాంటిక్ సన్నివేశాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తున్నారని అడిగితే.. చుట్టుపక్కల వారి సాయంతో మాస్కులు తయారు చేస్తున్నానని, అవసరమైన వారికి వాటిని అందజేస్తున్నట్టు తెలిపింది.
ఇంట్లోనే వంటలు వండి చుట్టుపక్కల వారికి పంపిణీ చేస్తున్నానని పేర్కొంది. వెబ్ సిరీస్లు చూస్తూ మిగతా సమయాన్ని గడుతున్నాని అంది.
తన రాబోయే చిత్రాల్లో హాట్ హాట్ అందాల ఆరబోతకు తాను సిద్ధమంటూ దర్శకనిర్మాతలకు చెప్పిందట. ఇప్పటికే తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్న లావణ్య ఆ సినిమాలో కాస్తంత హాట్ గానే కనిపిస్తుందిట.
ఆర్ఎక్స్ 100 హీరో నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలోనూ నటిస్తుంది.అవసరమైతే బికినీ అందాలను ఆరబోయడానికి తాను సిద్ధమంటోంది ఈ బ్యూటీ.
ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్లకు భారీ డిమాండ్ ఉందని, మంచి స్క్రిప్టు దొరికితే తాను కూడా నటించేందకు రెడీ అంటోంది ఈ బ్యూటీ
ఇప్పటి వరకు నాగార్జునతో మినహా పెద్ద స్టార్స్ తో నటించే అవకాశాలు రాలేదు. చిన్నా చితకా హీరోలతోనే ఈ అమ్మడు కెరీర్ నెట్టుకు వస్తుంది.
నాగార్జునతో చేసిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం మంచి హిట్ అయ్యింది. అయితే ఆ సినిమాలో ఈమె పాత్రను రమ్యకృష్ణ డామినేట్ చేసింది. ఆ సినిమాతో ఈమెకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు.
ఆ సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో పలువురు శ్రేయోభిలాషులు మిత్రులు నాగార్జునతో సినిమా వద్దంటే వద్దన్నారట.
సీనియర్ హీరోతో సినిమా చేస్తే ఇకపై వచ్చేవన్నీ కూడా అలాంటి ఛాన్స్ లే అయ్యి ఉంటాయంటూ హెచ్చరించారట. దాంతో అనుమానంతోనే ఆ సినిమా చేసిందట.
సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాకెన్నో మంచి విషయాలను నేర్పింది. షూటింగ్ సమయంలో నాగార్జున గారు చక్కని గైడెన్స్ ఇచ్చారు అంది.
ఇప్పటికి కూడా ఏదైనా సలహాలు కావాలంటే నాగార్జున గారిని అడుగుతానంది. అలాగని ప్రతీ చిన్నదానికి ఆయన దగ్గరకు పరుగెత్తను. కెరీర్ ని మలుపు తిప్పే సలహా అయితేనే అని చెప్పింది.
ఇక కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవ్వడంపై స్పందిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమాలకు కమిట్ అవ్వాల్సి వచ్చింది.
కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా కూడా ముందు నుండి ఉండే కమిట్ మెంట్స్ కారణంగా నటించాల్సి ఉంటుందని.. ఇకపై అలాంటి సినిమాలు చేయకుండా జాగ్రత్త పడతానంది.
ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లుగా చెప్పిన లావణ్య త్రిపాఠి మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా చెప్పింది. తన కెరీర్ పై ఈ అమ్మడికి చాలా ఆశలు ఉన్నట్లుగా అనిపిస్తుంది.