- Home
- Entertainment
- సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్న స్టార్స్ వీరే.. వెండితెర వెనుక హృదయాన్ని కదిలించే విషాదాలు
సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్న స్టార్స్ వీరే.. వెండితెర వెనుక హృదయాన్ని కదిలించే విషాదాలు
Actors Suicide: సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాలు లేకపోవడం వల్లే, బాలీవుడ్ మాఫియా వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయనలా ఇండస్ట్రీని విషాదంని మిగిల్చిన స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.

టీవీ నటుడు నితిన్ చౌహాన్
`స్ల్పిట్స్ విల్లా’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి టీవీ షోలలో కనిపించిన ఈ 35 ఏళ్ల నటుడు నితిన్ చౌహాన్, 2024 నవంబర్ లో ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. చాలా ఏళ్లుగా టీవీ, సినిమా అవకాశాలు లేకపోవడంతో అతను డిప్రెషన్తో బాధపడ్డాడని, దీని కారణంగానే మరణించినట్టు పోలీస్ రిపోర్ట్ లో తేలిపింది. ఆయనకు అప్పటికే పెళ్లై ఓ కూతురు కూడా ఉన్నారు.

భోజ్పురి నటి అమృతా పాండే
27 ఏళ్ల భోజ్పురి నటి అమృతా పాండే, ఏప్రిల్ 2024లో భాగల్పూర్లోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకొని షాకిచ్చింది. ఆమెను అన్నపూర్ణ అనే స్క్రీన్ నేమ్తో కూడా పిలుస్తారు. చాలాకాలంగా అవకాశాలు రాకపోవడంతో ఆమె డిప్రెషన్తో బాధపడిందని, దీని కారణంగా ఆమె ప్రాణాలు తీసుకుందని విచారణలో బయటపడింది.
టీవీ నటుడు మన్మీత్ గ్రెవాల్
32 ఏళ్ల టీవీ నటుడు మన్మీత్ గ్రెవాల్, మే 2020లో ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. నటించడానికి ప్రాజెక్ట్ లు లేకపోవడంతో పెరుగుతున్న అప్పులను భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురై ప్రాణాలు విడిచినట్టు తెలిసింది.
టీవీ నటి ప్రేక్షా మెహతా
‘క్రైమ్ పెట్రోల్’లో కనిపించిన టీవీ నటి ప్రేక్షా మెహతా, మే 2020లో ఇండోర్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 25 ఏళ్ల ఈ నటి, మహమ్మారి లాక్డౌన్ సమయంలో అవకాశాలు లేకపోవడం, షూటింగ్లు ఆగిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిందని, దీంతో ఆత్మహత్యకు పాల్పడిందని రిపోర్టులు వచ్చాయి.
ఎంఎస్ ధోనీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, జూన్ 2020లో బాంద్రాలోని తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. 34 ఏళ్ల సుశాంత్ అవకాశాలు తగ్గడం, సక్సెస్ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకున్నారు. ఆయన మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ సినిమా మాఫియా ఆయన్ని ఎదగనివ్వలేదని, అవకాశాలు రాకుండా చేశారని, దీని కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సుశాంత్ `ఎంఎస్ ధోని` చిత్రంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.
బెంగాలీ నటి మౌమితా సాహా
బెంగాలీ టీవీ నటి మౌమితా సాహా నటిగా ఎదుగుతున్న సమయంలోనే , 2019లో కోల్కతాలోని తన ఫ్లాట్లో చనిపోయి కనిపించింది. పోలీస్, సోషల్ మీడియా విచారణ ప్రకారం, 23 ఏళ్ల ఈ నటి సినిమా, టీవీ పరిశ్రమలో గుర్తింపు కోసం పోరాడుతూ తీవ్రమైన డిప్రెషన్తో బాధపడింది. ఆయా పరిస్థితులు తట్టుకోలేక వెళ్లిపోయిందంటారు.
నటుడు కుశాల్ పంజాబీ
నటుడు, డ్యాన్సర్ అయిన కుశాల్ పంజాబీ, డిసెంబర్ 2019లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 42 ఏళ్ల ఈ నటుడు డిప్రెషన్, వ్యక్తిగత సమస్యలు, పనిలేకపోవడంతో వచ్చిన ఆర్థిక ఒత్తిడితో బాధపడ్డాడని, దీని కారణంగా ఆయన మరణించినట్టు తెలిసింది.
నటి శిఖా జోషి
‘బి.ఏ. పాస్’ సినిమాలో నటించిన నటి శిఖా జోషి, మే 2015లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించింది. చనిపోయే ముందు 40 ఏళ్ల శిఖా, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యాక్టింగ్ అవకాశాలు రాకపోవడంపై తీవ్ర నిరాశ, డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పింది.
Disclaimer: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మీకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని లేదా మిమ్మల్ని మీరు గాయపరుచుకోవాలని ఆలోచనలు వస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోండి. కింద ఇచ్చిన హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేసి కూడా సహాయం పొందవచ్చు. ఆస్రా (ముంబై) 022-27546669, సుమైత్రీ (ఢిల్లీ) 011-23389090, రోష్ని (హైదరాబాద్) 040-66202000, లైఫ్లైన్ 033-64643267 (కోల్కతా). స్పందన్ (మధ్యప్రదేశ్) 9630899002, 7389366696, సంజీవని: 0761-2626622, TeleMANAS 1-8008914416/14416, జీవన్ ఆధార్: 1800-233-1250. వండ్రేవా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్: 9999666555 , ISS iCall: 022-25521111. మానసిక ఒత్తిడికి కౌన్సెలింగ్ కోసం 14416, 1800 8914416 హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించి ఇంట్లో నుంచే సహాయం పొందవచ్చు.

