ప్రపంచ కప్ 2019: దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్... టీమిండియా బలాలు, బలహీనతలివే
ఇంగ్లాడ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తున్న ఇండియాలో మాత్రం రేపటి(బుధవారం) నుండే ఈ టోర్నీ మొదలవనుంది. ఎందుకంటే ఈ వారం రోజుల్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య రేపు జరగనున్న మ్యాచ్ ద్వారా భారత్ లో ప్రపంచ కప్ సందడి మొదలవనుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన సౌత్ ఆఫ్రికా టీమిండియాపై గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తుండగా...టీమిండియా మాత్రం గెలుపుతోనే బోణీ కొట్టాలని చూస్తోంది. ఇలా ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో రేపటి మ్యాచ్ పై అభిమానుల్లోమరింత ఆసక్తి పెరిగింది.
ఇంగ్లాడ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తున్న ఇండియాలో మాత్రం రేపటి(బుధవారం) నుండే ఈ టోర్నీ మొదలవనుంది. ఎందుకంటే ఈ వారం రోజుల్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య రేపు జరగనున్న మ్యాచ్ ద్వారా భారత్ లో ప్రపంచ కప్ సందడి మొదలవనుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన సౌత్ ఆఫ్రికా టీమిండియాపై గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తుండగా...టీమిండియా మాత్రం గెలుపుతోనే బోణీ కొట్టాలని చూస్తోంది. ఇలా ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో రేపటి మ్యాచ్ పై అభిమానుల్లోమరింత ఆసక్తి పెరిగింది.
సౌతాంప్టన్ వేదికన జరగనున్న ఈ మ్యాచ్ ద్వారా భారత బౌలింగ్ విభాగం బలమేంటో తేలనుంది. డుప్లెసిస్, డికాక్, మిల్లర్, ఆమ్లా వంటి ప్రపంచ స్థాయి బ్యాట్ మెన్స్ ని అడ్డుకోవాలంటే అంత ఈజీ కాదు. అయితే ఇప్పటికే వరుస ఓటములతో ఢీలాపడి ఒత్తిడిని ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా బ్యాట్ మెన్స్ పై పైచేయి సాధించేందుకు టీమిండియా బౌలర్లకు ఇదే మంచి అవకాశం.
ఇలాంటి అవకాశం లేకున్నా సౌతాఫ్రికా బ్యాట్ మెన్స్ ను సమర్థవంతంగా అడ్డుకోగల సత్తా భారత బౌలర్లకు వుంది. ముఖ్యంగా బుమ్రా వంటి యార్కర్ స్పెషలిస్ట్ టీమిండియా బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తుండటం కలిసొచ్చే అంశం. అతడికి తోడుగా భువనేశ్వర్, షమీలతో పేస్ విభాగం, కుల్దీప్, చాహల్ లలో స్పిన్ విభాగం అత్యుత్తమంగా వుంది. ఇలాంటి పటిష్టమైన బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కోవడం సౌతాఫ్రికాకు సవాలుగా మారనుంది.
అయితే టీమిండియాను ఎప్పుడు వేదించే సమస్య ఈ టోర్నీలో కూడా పనరావృతం అయితే ఇబ్బందులు తప్పవు. అదేంటంటే...ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ని ఆరంభ, చివరి ఓవర్లలో సమర్థవంతంగా అడ్డుకుని వికెట్లు తీయడంలో మన బౌలర్ల సామర్థ్యాన్ని శంకించలేం. కానీ మిడిల్ ఓవర్లలోనే మన బౌలింగ్ డొల్లతనమంతా బయటపడుతుంది. ఇలా మిడిల్ ఓవర్లలో మ్యాచ్ పై పట్టు కోల్పోయి కోహ్లీ సేన ఓటమిపాలైన సందర్భాలు అనేకం వున్నాయి. కాబట్టి స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ లు చెలరేగి వికెట్లు తీయగలిగితే దక్షిణాఫ్రికాపై విజయం మనదే.
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే గతకొంతకాలంగా టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు విఫలమవుతూ వస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన రెండు మ్యాచుల్లోనూ వారిద్దరు గట్టి పునాదిని ఏర్పర్చలేకపోయారు. ఇలా టీమిండియా ఓపెనర్లు కాస్త భయపెడుతున్నా...ఐసిసి టోర్నీలో వారు రెచ్చిపోతారన్న ట్రాక్ రికార్డు ఆ ఆందోళనను కొద్దిగా తగ్గించింది.
మిడిల్ ఆర్డర్ వైఫల్యం కూడా టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. టాప్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారి వీరు కూడా చేతులెత్తేస్తుంటారు. ధోని వంటి సీనియర్ ఆటగాళ్లు ఒకరిద్దరు తప్ప మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ ఒక్కరుకూడా మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన పరిస్ధితులు లేవు. అయితే సెకండ్ వార్మఫ్ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించి సత్తా చాటాడు. అతడిలా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగే ప్రతి ఆటగాడు బ్యాటింగ్ బాధ్యతను మీదేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
భారత జట్టు ప్రధాన బలం బ్యాటింగ్. మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి సీనియర్లకు కెఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యా, మురళీ విజయ్ వంటి జూనియర్లు తోడయితే భారత్ గెలుపును అడ్డుకునేవారే వుండరు. ఇలా పటిష్టమైన బ్యాటింగ్ విబాగాన్ని పరుగుల సాధించకుండా అడ్డుకోవడం దక్షిణాఫ్రికా బౌలర్లకు కష్టమైన పనే.
అయితే ఫీల్డింగ్ విషయంలో మాత్రం టీమిండియా ఆటగాళ్లు ఇంకాస్త మెరుగుపడాల్సి వుంది. రవీంద్ర జడేజా, పాండ్యా వంటి చురుకైన ఫీల్డర్లున్నా జట్టు మొత్తం ఫీల్డింగ్ బాగా చేసినపుడే పరుగులకు ఆపడం, కఠిన మైన క్యాచులను అందుకున మ్యాచ్ ను మనవైపు తిప్పుకోవడం జరుగుంది. ఈ విషయంలో దక్షిణాఫ్రికా చాలా పటిష్ట జట్టు. ఆ జట్టులో ప్రతి ఆటగాడు ఓ అద్భుతమైన ఫీల్డరే. వారిలా భారత ఆటగాళ్లు కూడా మైదానంలో చురుగ్గా కదిలితే మంచి ఫలితాన్ని రాబట్టవచ్చు.