- Home
- Sports
- Cricket
- రెండు రోజులుగా ముంబై ఎయిర్పోర్టులో ఆసీస్ ప్లేయర్లు... ఇంటికెళ్తామని వెళ్లి ఇరుక్కుపోయి...
రెండు రోజులుగా ముంబై ఎయిర్పోర్టులో ఆసీస్ ప్లేయర్లు... ఇంటికెళ్తామని వెళ్లి ఇరుక్కుపోయి...
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్న ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్... స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

<p>దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్న ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్... స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి అర్ధాంతరంగా బ్రేక్ తీసుకుని రెండు రోజుల క్రితమే స్వదేశానికి పయనమైన ఈ ప్లేయర్లు, మధ్యలోనే ఇరుక్కుపోయారట.</p>
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్న ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్... స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి అర్ధాంతరంగా బ్రేక్ తీసుకుని రెండు రోజుల క్రితమే స్వదేశానికి పయనమైన ఈ ప్లేయర్లు, మధ్యలోనే ఇరుక్కుపోయారట.
<p>ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ బయో బబుల్ జోన్ నుంచి బయటికి వచ్చి, స్వదేశానికి పయనమయ్యారు. అయితే ఆస్ట్రేలియా, ఇండియా నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో ఈ ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు రెండు రోజులుగా ముంబై ఎయిర్పోర్టులోనే ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆర్సీబీ, తన తర్వాతి మ్యాచుల కోసం అహ్మదాబాద్ చేరుకుంది. </p>
ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ బయో బబుల్ జోన్ నుంచి బయటికి వచ్చి, స్వదేశానికి పయనమయ్యారు. అయితే ఆస్ట్రేలియా, ఇండియా నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో ఈ ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు రెండు రోజులుగా ముంబై ఎయిర్పోర్టులోనే ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆర్సీబీ, తన తర్వాతి మ్యాచుల కోసం అహ్మదాబాద్ చేరుకుంది.
<p>అయితే వీరితో పాటు ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆసీస్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై మాత్రం దోహా మీదుగా ఆస్ట్రేలియా చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇప్పటికే టై అక్కడికి చేరకున్నట్టు సమాచారం.</p>
అయితే వీరితో పాటు ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆసీస్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై మాత్రం దోహా మీదుగా ఆస్ట్రేలియా చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇప్పటికే టై అక్కడికి చేరకున్నట్టు సమాచారం.
<p>ముంబై ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన ప్లేయర్లను ఆస్ట్రేలియాకి పంపించడానికి బీసీసీఐ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నాయి. </p>
ముంబై ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన ప్లేయర్లను ఆస్ట్రేలియాకి పంపించడానికి బీసీసీఐ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నాయి.
<p>ప్రస్తుత పరిస్థితుల్లో మే 15 దాకా భారత్ నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిషేధం విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఈలోపు ఆసీస్ ప్లేయర్లు స్వదేశానికి చేరుకోవడానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయట.</p>
ప్రస్తుత పరిస్థితుల్లో మే 15 దాకా భారత్ నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిషేధం విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఈలోపు ఆసీస్ ప్లేయర్లు స్వదేశానికి చేరుకోవడానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయట.