MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌లో రెస్ట్ కావాలని ఎవ్వడూ అనడేంటి... విండీస్ టూర్‌లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంపై..

ఐపీఎల్‌లో రెస్ట్ కావాలని ఎవ్వడూ అనడేంటి... విండీస్ టూర్‌లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంపై..

ఐపీఎల్‌ 2022 సీజన్ తర్వాత భారత జట్టు మూడు సిరీసులు ఆడితే అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు ఆడింది ఒక్కటంటే ఒకే సిరీస్. మళ్లీ వెస్టిండీస్‌తో సిరీస్‌కి ఈ ప్లేయర్లు దూరంగా ఉంటున్నారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 12 2022, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస‌ ఆడబోతోంది భారత జట్టు. ఈ పర్యటనలో వన్డే సిరీస్‌కి ఇప్పటికే జట్టును ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి సీనియర్లు అందరూ రెస్ట్ ఇవ్వడంతో ఈ వన్డే సిరీస్‌కి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు... ఈ ఏడాది భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఏడో ప్లేయర్‌గా నిలవబోతున్నాడు శిఖర్ ధావన్..

38

ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ ఆడిన విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా... వన్డే, టీ20 సిరీస్ ఆడిన రోహిత్ శర్మ... వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి రెస్ట్ తీసుకోవడంపై తీవ్రంగా స్పందించాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..

48

‘ప్లేయర్లు ఇలా రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎవ్వరూ కూడా ఐపీఎల్ సమయంలో రెస్ట్ కావాలని అడగరు? అలాంటప్పుడు టీమిండియాకి ఆడేటప్పుడు మాత్రం రెస్ట్ కావాలా?

58

భారత జట్టుకి ఆడేటప్పుడు ప్రతీ మ్యాచ్‌కీ అందుబాటులో ఉండాలి. రెస్ట్ గురించి మాట్లాడకూడదు. అదీకాకుండా ఇప్పుడు ఎక్కువగా ఆడేది టీ20 మ్యాచులే. 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లు ఆడినందుకు అంతగా అలిసిపోతున్నారా? 

68

టెస్టు మ్యాచులు ఆడితే శరీరంపై ఒత్తిడి పడుతుంది. రోజంతా ఫీల్డింగ్ చేయడం వల్ల అలిసిపోతాం. టీ20 క్రికెట్‌‌లో గంటన్నర, రెండు గంటలు క్రీజులో ఉండడానికే అంత అలిసిపోతున్నారా...

78
Image credit: Getty

Image credit: Getty

బీసీసీఐ ఇలా సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే పద్ధతి మానుకుంటే బెటర్. గ్రేడ్ 1 ప్లేయర్లు మంచి పారితోషికం అందుకుంటున్నారు. ప్రతీ మ్యాచ్‌కి కలిపి డబ్బులు తీసుకుంటున్నారు... 

88

అలాంటప్పుడు ఏ కంపెనీ అయినా డబ్బులు చెల్లిస్తే వారికి నెలకు ఇన్నిసార్లు రెస్ట్ ఇస్తారా? ఒకవేళ రెస్ట్ కావాలనుకుంటే, వాళ్లకి ఇచ్చే పారితోషికం కూడా కట్ చేయాలి. అప్పుడే అందరూ అన్నీ మ్యాచులు ఆడాలని అనుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Recommended image3
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved