IPL 2021: పాల్ వాల్తేటి... సూపర్ కింగ్స్పై సెంచరీ చేసిన ఈ సెన్సేషనల్ ప్లేయర్ ఏమయ్యాడు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఎంతోమంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. డేవిడ్ వార్నర్తో పాటు బ్రెండన్ మెక్కల్లమ్, శిఖర్ ధావన్, బుమ్రా, పాండ్యా బ్రదర్స్.. ఇలా ఎందరో కెరీర్ను మార్చేసింది ఐపీఎల్. అలా ఐపీఎల్లో ఇరగదీసిన ప్లేయర్ పాల్ వాల్తేటి... ఇప్పుడు ఏమయ్యాడు, ఏం చేస్తున్నాడు?
ముంబైలో జన్మించిన పాల్ వాల్తేటి అసలు పేరు పాల్ చంద్రశేఖర్ వాల్తేటి. 2002 ఐసీసీ అండర్ 19 వరల్డ్కప్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు వాల్తేటి...
పాల్ వాల్తేటిని ఐపీఎల్ 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. అదే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేసిన వాల్తేటి, అజేయంగా నిలిచి పంజాబ్కి ఘన విజయాన్ని అందించాడు.
వాల్తేటి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 189 పరుగుల టార్గెట్ను 19.1 ఓవర్లలో చేధించింది పంజాబ్ కింగ్స్... ఐపీఎల్ చరిత్రలో చేధనలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ వాల్తేటియే...
2011 సీజన్లో మొట్టమొదటి సెంచరీ చేసిన ప్లేయర్ పాల్ వాల్తేటి. ఐపీఎల్ కెరీర్లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోరు వాల్తేటిదే... మొత్తంగా 2011 సీజన్లో 463 పరుగులు చేశాడు వాల్తేటి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తర్వాతి మ్యాచ్లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసిన పాల్ వాల్తేటి... ఆ తర్వాత 2012, 13 సీజన్లలో ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో ఫెయిల్ అయిన వాల్తేటి... క్రేజ్ కోల్పోయాడు. కెరీర్ ప్రారంభం నుంచి గాయాలతో సతమతమైన వాల్తేటి కంటికి గాయం కావడంతో క్రికెట్కే పూర్తిగా దూరమయ్యాడు...
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించిన పాల్ వాల్తేటి ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఎయిర్ ఇండియా తరుపున డొమెస్టిక్ టోర్నీలు ఆడుతున్న వాల్తేటి, ముంబైలో కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు...