మాహీ కోసం ఈసారి టైటిల్ గెలుస్తాం, అదే జరిగితే... సురేష్ రైనా కామెంట్...
ముంబై ఇండియన్స్ తర్వాత ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. గత ఏడాది దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చినా, ఈ ఏడాది బాగానే ఆడుతోంది. మాహీ కోసం ఈసారి టైటిల్ గెలవాలని భావిస్తున్నట్టు తెలిపాడు ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా...
10 సీజన్లలో ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుగా ఉన్న సీఎస్కే, గత ఏడాది పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది... సురేష్ రైనా లేకుండా తొలిసారి బరిలో దిగి ప్లేఆఫ్స్కి కూడా అర్హత సాధించలేకపోయింది...
‘ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలవాలని అనుకుంటున్నాం. దుబాయ్కి వెళ్లిన తర్వాత మాకు క్యాంప్ ఉంటుది. ఈసారి ధోనీ కోసం టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా...
ఈ ఏడాది మా పర్ఫామెన్స్ నాకు సంతృప్తినిచ్చింది. ధోనీ భాయ్ కెప్టెన్సీ, మాకు ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ను నింపింది...
మాహీ జట్టులో ప్రతీ ప్లేయర్ సక్సెస్ను, తన సక్సెస్లా ఎంజాయ్ చేస్తాడు. ఈసారి సీఎస్కే ప్లేయర్లు మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, రుతురాజ్ గైక్వాడ్, జడ్డూ, అంబటి రాయుడు.. ఇలా చాలామంది సక్సెస్ అయ్యారు...
జట్టులోని ప్రతీ ప్లేయర్కి కావాల్సినంత ఫ్రీడమ్ ఇవ్వడం మాహీ భాయ్ స్పెషాలిటీ. మొయిన్ ఆలీ, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, సామ్ కుర్రాన్ లాంటి ప్లేయర్లు ఉండడం వల్ల మా జట్టు బలంగా ఉంది...
మహేంద్ర సింగ్ ధోనీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన నాకు కెప్టెన్ కంటే చాలా ఎక్కువ. మాహీ భాయ్ నాకు అన్నలాంటి వాడు...
వచ్చే సీజన్లో మాహీ భాయ్ ఆడతాడో లేదో తెలీదు. ఒకవేళ ఈ సీజన్లో టైటిల్ గెలిస్తే మాత్రం, వచ్చే సీజన్ ఆడేలా ఆయన్ని నేను ఒప్పిస్తాను...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా...
మాహీ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు చెప్పిన రోజే, తాను కూడా తప్పుకుంటున్నట్టుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న సురేష్ రైనా, మాహీ ఆడకపోతే ఐపీఎల్ కూడా ఆడనని తేల్చేశారు...
అంతేకాకుండా వచ్చే ఏడాది మెగా వేలం ఉన్న కారణంగా, ఐపీఎల్ ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడతానని, వేరే జట్టు తరుపున ఆడబోనని కూడా కామెంట్ చేశాడు రైనా...