MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వీరూ, ఆర్తి విడిపోతున్నారా? 20 ఏళ్ల బంధం ముగిసిందా?

వీరూ, ఆర్తి విడిపోతున్నారా? 20 ఏళ్ల బంధం ముగిసిందా?

Virender Sehwag and Aarti Ahlawat divorce rumors: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లవాత్‌ తో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మీడియాలో, అభిమానుల్లో సంచలనం సృష్టించింది.

3 Min read
Mahesh Rajamoni
Published : Jan 24 2025, 07:03 PM IST| Updated : Jan 24 2025, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టీమిండియా  సెహ్వాగ్ కొన్నేళ్ల క్రితమే క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ విడాకుల పుకార్ల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత సెహ్వాగ్, ఆయన భార్య ఆర్తి విడిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మీడియాలో, అభిమానుల్లో సంచలనం సృష్టించింది. 

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ . అభిమానులు 'వీరూ' అని పిలుచుకునే సెహ్వాగ్ ఆటతీరు అందరికీ నచ్చుతుంది. భారత్ తరపున ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన సెహ్వాగ్.. టెస్ట్, వన్డేల్లో 16,000 పైగా పరుగులు చేశాడు. 

క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక క్రికెట్ సంబంధిత కార్యక్రమాలు, కాలేజీ ఫంక్షన్లలో పాల్గొంటున్నాడు. సెహ్వాగ్ భార్య ఆర్తి అహ్లవాత్. 2004లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కొంత కాలంగా సెహ్వాగ్, ఆర్తి విడిగా ఉంటున్నారనీ, విడాకులు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

25

వీడిగా ఉంటున్న సెహ్వాగ్-ఆర్తి ?

టీమిండియా  సెహ్వాగ్ కొన్నేళ్ల క్రితమే క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ విడాకుల పుకార్ల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత సెహ్వాగ్, ఆయన భార్య ఆర్తి విడిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మీడియాలో, అభిమానుల్లో సంచలనం సృష్టించింది. 

విడాకుల పుకార్ల మధ్య భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసినట్లు కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 20 సంవత్సరాల వివాహ బంధానికి వీరు వీడ్కోలు పలుకుతున్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఎందుకంటే వారు చాలా నెలలుగా విడివిడిగా ఉంటున్నారని మీడియా కథనాలు కూడా పేర్కొంటున్నాయి.

సెహ్వాగ్, ఆర్తీ 2004 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ ఉన్నారు. గత కొన్ని నెలలుగా మాజీ భారత ఓపెనర్ భార్య సోషల్ మీడియాలో పంచుకున్న అతని ఫోటోలలో కనిపించడం లేదని అభిమానులు గమనించారు. ఇది వారి వీడాకుల పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. ఈ జంట ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయలేదు కానీ సెహ్వాగ్ వ్యక్తిగత జీవితంలో అంతా బాగాలేదనే ఊహాగానాలు అభిమానులలో ఉన్నాయి.

35

సెహ్వాగ్, ఆర్తి ఫోటోలు వైరల్ 

దీపావళి వేడుకల్లో సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ, ఆర్తి ఆ ఫోటోల్లో లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. రెండు వారాల క్రితం సెహ్వాగ్ పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయానికి వెళ్లి, అక్కడ తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోల్లో కూడా ఆర్తి కనిపించకపోవడంతో ఇద్దరూ విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి.

అయితే, సెహ్వాగ్, ఆర్తి విడిపోతున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయినా, ఇద్దరూ విడిగా ఉంటున్నారని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెహ్వాగ్, ఆర్తి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఆర్తి అహ్లవాత్ 1980 డిసెంబర్ 16న జన్మించింది. ఆర్తి లేడీ ఇర్విన్ హైస్కూల్, భారతీయ విద్యా భవన్‌లో చదువుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని మైత్రేయి కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా పూర్తి చేసింది. 

45

వీరేంద్ర సెహ్వాగ్.. ధనాధన్ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు  

సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్‌లో ఇండియా రెండో అత్యుత్తమ ఓపెనర్‌గా పేరుపొందాడు. అతని అద్భుతమైన ఆటతీరుతో  టెస్టు క్రికెట్ లో ధనాధన్ ఇన్నింగ్స్ దిక్సూచిగా మారాడు.  ఢిల్లీలో జన్మించిన ఈ క్రికెటర్ 104 మ్యాచ్‌లలో (180 ఇన్నింగ్స్‌లు) 49.34 సగటుతో 23 సెంచరీలు, 32 అర్ధసెంచరీలతో 8586 పరుగులు చేశాడు.

2004లో ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై ఫార్మాట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా రికార్డు పుస్తకాలలో తన పేరును లిఖించుకున్నాడు. 2008లో దక్షిణాఫ్రికాపై చెన్నైలో మరో ట్రిపుల్ శతకం సాధించాడు.

55

వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో భాగమైన సెహ్వాగ్

వన్డేలలో వీరేంద్ర సెహ్వాగ్ 251 మ్యాచ్‌లలో (245 ఇన్నింగ్స్‌లు) 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలతో 104.33 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. సెహ్వాగ్ తన మొదటి బంతిని బౌండరీలతో టోర్నమెంట్‌ను ప్రారంభించడంతో పాటు 2011 వన్డే ప్రపంచ కప్ జట్టులో కూడా భాగంగా ఉన్నాడు. సెహ్వాగ్ రెండు అర్ధ సెంచరీలతో T20Iలలో 394 పరుగులు చేశాడు. 2007 T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కూడా భాగంగా ఉన్నాడు. విజయవంతమైన కెరీర్ తర్వాత సెహ్వాగ్ అక్టోబర్ 2015లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved