ట్విట్టర్లోనూ కొనసాగిన ‘కింగ్’ విరాట్ కోహ్లీ హవా... తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, ధోనీ...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, పాపులారిటీ రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. రన్ మెషిన్ ఈ మధ్య తన రేంజుకి తగ్గట్టుగా పరుగుల వరద పారించలేకపోతున్నా, ‘కింగ్’ కోహ్లీ క్రేజ్లో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ ఏడాది ట్విట్టర్లో అత్యధికంగా చర్చించుకున్న క్రికెటర్గా, భారత ప్లేయర్గా, స్పోర్ట్స్ పర్సనాలిటీగా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ కరోనా లాక్డౌన్ కారణంగా ఏడు నెలల పాటు క్రికెట్కి దూరంగా గడిపాడు. అయితే ఇదే సమయంలో విరాట్ తండ్రి కాబోతున్నాడనే వార్త బయటికి రావడంతో కోహ్లీ గురించి చాలామంది చర్చించుకున్నారు...
లాక్డౌన్ టైమ్లో భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ చేసిన చిలిపి అల్లరి వీడియోలు, ఐపీఎల్ 2020లో విరాట్ కోహ్లీ ప్రదర్శన... ఇలా అనేకసార్లు విరాట్ చర్చకు వచ్చాడు..
వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల మైలురాయి అందుకున్న క్రికెటర్గా నిలిచిన విరాట్, 22వేల అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసుకున్నాడు కూడా. ఈ రికార్డులు కూడా విరాట్ను తరుచూ వార్తల్లో నిలిపాయి.
వన్డే వరల్డ్కప్ 2019 తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉంటూ రావడం, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ ఫెయిల్ అవుతుండడంతో మాహీ పేరు ట్విట్టర్లో చాలాసార్లు వినిపించింది.
స్వాతంత్ర్య దినోత్సవం 2020 నాడు సడెన్గా క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2020 సీజన్లో సీఎస్కేని ప్లేఆఫ్ చేర్చడంలో విఫలం కావడం కూడా ధోనీ గురించి చాలామంది చర్చించుకోవడానికి కారణమైంది.
అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీకి అభినందనలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన రెండు పేజీల లేఖలో ట్విట్టర్లో సంచలనం సృష్టించింది. దీన్ని పోస్టు చేసిన ధోనీ ట్వీటు, అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్గా నిలిచింది.
తాము త్వరలో పేరెంట్స్గా మారబోతున్నామంటూ విరుష్క జోడి చెప్పిన స్వీట్ న్యూస్... ఈ ఏడాదిలోనే అత్యధిక లైక్స్ పొందిన ట్వీట్గా నిలిచింది...
మరోవైపు ముంబై ఇండియన్స్కి రికార్డు లెవెల్లో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మ, ట్విట్టర్లో పెద్ద చర్చకే తెరతీశాడు...
రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ అప్పగించాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ వినిపించింది. దీంతో పాటు రోహిత్ శర్మ మిస్టరీ గాయం గురించి కూడా పెద్ద చర్చే జరిగింది, జరుగుతోంది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఐపీఎల్ 2020 గురించి చర్చించుకున్నారు ట్విట్టర్ యూజర్లు...
అందులోనూ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిల్యూర్ కారణంగా... ‘విజిల్ పోడు’ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ఐపీఎల్ 2020 తర్వాత అత్యధికమంది వాడిన ట్యాగ్గా నిలిచింది.
ఇవే కాకుండా సాకర్ స్టార్ రొనాల్డోకి కరోనా పాజిటివ్ రావడం, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలు, ఏబీ డివిల్లియర్స్ ఇన్నింగ్స్ల గురించి ఎక్కువగా చర్చించుకున్నారు నెటిజన్లు...