- Home
- Sports
- Cricket
- డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ భారత్కు కెప్టెన్గా ఉండాలి : రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ భారత్కు కెప్టెన్గా ఉండాలి : రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
WTC Finals 2023: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసినా అతడి సన్నిహితుడు, మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆ మైకం నుంచి ఇంకా తప్పుకోవడం లేదు.

ఈ ఏడాది జూన్ 7 నుంచి 12 వరకు భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇదివరకే రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టును కూడా ప్రకటించింది. అయితే తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం రోహిత్ కాకుంటే విరాట్ కోహ్లీని కెప్టెన్ గా నియమించాలని అంటున్నాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘భారత్ కు ఈ టెస్టు చాలా కీలకం. ఈ గేమ్ కు రోహిత్ శర్మ ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నా. అతడు జట్టు సారథి. కానీ జరగరానిది ఏమైనా జరిగి అతడు గాయపడి జట్టు నుంచి తప్పుకుంటే మాత్రం అప్పుడు ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాలి.
Image credit: PTI
అలాంటి సమయాల్లో నేనైతే విరాట్ కోహ్లీ వైపే చూస్తాను. నాకు తెలిసి రాహుల్ ద్రావిడ్ కూడా అదే చేస్తాడని అనుకుంటున్నా. వాస్తవానికి గతేడాది భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ (2021లో) మిగిలిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు బర్మింగ్హామ్ వెళ్లింది. ఈ మ్యాచ్ కు కూడా రోహిత్ కరోనా కారణంగా మ్యాచ్ ఆడలేదు. మేం కోహ్లీని సారథిగా నియమించాలని సూచించాం.
ఎందుకంటే అతడు అప్పటికే టెస్టు సిరీస్ ను 2-1 ఆధిక్యంతో గెలుచుకుని ఉన్నాడు. అది కచ్చితంగా భారత్ కు హెల్ప్ చేసి ఉండేది. ఇదే పరిస్థితి రిపీట్ అయితే మాత్రం కోహ్లీ కచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు సారథిగా ఉండాలి..’ అని చెప్పాడు.
సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక కోహ్లీ ఇటీవలే మళ్లీ ఆర్సీబీని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఫాఫ్ డుప్లెసిస్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుతూ అతడి స్థానంలో కోహ్లీ సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా కోహ్లీ మళ్లీ టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని శాస్త్రి కోరుతున్నాడు
డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్