రవిభాయ్, వీడి బౌలింగ్ ఆడడం చాలా కష్టం... ఆ స్టార్ బౌలర్ గురించి విరాట్ కోహ్లీ...
ఫాస్ట్ బౌలర్లను వాడడంలో విరాట్ కోహ్లీ చాలా స్పెషల్. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ హయాంలో టీమిండియాలోకి జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, నవ్దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి యంగ్ ఫాస్ట్ బౌలర్లు వచ్చారు. మ్యాచ్ విన్నర్లుగా మారారు...
bumrah Kohli
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన జస్ప్రిత్ బుమ్రాని ముందుగా విదేశాల్లోనే వాడింది భారత జట్టు. విదేశాల్లో 20కి పైగా టెస్టులు ఆడిన తర్వాత స్వదేశంలో టెస్టు ఆరంగ్రేటం చేశాడు జస్ప్రిత్ బుమ్రా. బుమ్రాని భద్రంగా దాచిపెట్టి, సౌతాఫ్రికాలో ఆరంగ్రేటం చేయించాడు విరాట్ కోహ్లీ...
‘సౌతాఫ్రికా టూర్కి 10 రోజుల ముందుగానే వెళ్లాం. అక్కడి వికెట్ని అర్థం చేసుకోవడానికి విరాట్ కోహ్లీ ముందుగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో బుమ్రా బౌలింగ్, కోహ్లీని బాగా ఇంప్రెస్ చేసింది. నాకు బాగా గుర్తు. మొదటి రోజు ప్రాక్టీస్ తర్వాత విరాట్, రవిశాస్త్రి దగ్గరికి వచ్చాడు...
Image credit: PTI
‘రవి భాయ్, ఈ కుర్రాడి బౌలింగ్ ఆడడం చాలా కష్టం. ఇతను ఎప్పుడు బాల్ రిలీజ్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు..’ అని చెప్పాడు. మిగిలిన బౌలర్ల కంటే ఇతన్ని సెలక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నా...
తొలి టెస్టులో బుమ్రాని ఆడించాలని అనుకున్నాం. ఎందుకంటే ఆ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అద్భుతంగా సహకరిస్తోంది. ఈ వికెట్ చాలా బాగుంది, నీకు బాగా హెల్ప్ అవుతుందని బుమ్రాని చెప్పాను. అయితే జస్ప్రిత్ బుమ్రా మాత్రం ఇలాంటి వికెట్ మీద ఆడడానికి ఇష్టపడలేదు...
kohli bumrah
‘సార్, నేను ఈ మ్యాచ్ ఆడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది నా లాంటి బౌలర్లకు బాగా హెల్ప్ అవుతోంది. మన బ్యాటర్లు కూడా ఇదే పిచ్పై బ్యాటింగ్ చేయాలి. కాబట్టి నేను ఇలాంటి పిచ్పై ఆరంగ్రేటం చేయడం కరెక్ట్ కాదు...’ అని చెప్పాడు. ఆ మాటలకు నేను బాగా ఇంప్రెస్ అయ్యాను...
Kohli Bumrah
అయితే తొలి టెస్టులో బుమ్రాని ఆడించాం. రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, తొలి ఇన్నింగ్స్లో ఓ వికెట్ మాత్రమే తీశాడు. అయితే అతని బౌలింగ్ చూసి, టీమిండియాకి మ్యాచ్ విన్నర్ అవుతాడని ముందుగానే ఊహించా... ’ అంటూ క్రిక్భజ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్..