కోహ్లీ చేసిన ఆ మూడు తప్పులే... మొదటి వన్డే ఓటమికి కారణాలివేనా...
First Published Nov 28, 2020, 11:02 AM IST
ఆసీస్ టూర్లో ఫెవరెట్ టీమ్గా బరిలో దిగిన టీమిండియా... మొదటి వన్డే మ్యాచ్లోనే తేలిపోయింది. జస్ప్రిత్ బుమ్రా, షమీ వంటి టాప్ పేసర్లు ఉన్న టీమిండియా, ప్రత్యర్థి భారీ స్కోరు ముట్టజెప్పింది. ఆ తర్వాత లక్ష్యచేధనలో ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. అయితే మొదటి వన్డే ఓటమికి విరాట్ కోహ్లీ చేసిన మూడు తప్పులే కారణమని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.

టాస్... బ్యాటింగ్కి అనుకూలించే సిడ్నీ టెస్టులో టాస్ చాలా కీలకం. ఇక్కడ టాస్ గెలిచిన జట్లకే మెజారిటీ మ్యాచుల్లో గెలుపుదక్కింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి వన్డేలో టాస్ ఓడిపోవడం టీమిండియాకి పెద్ద మైనస్ పాయింట్ అయ్యింది.

నవ్దీప్ సైనీ... వెన్నునొప్పితో బాధపడుతున్న నవ్దీప్ సైనీ మొదటి వన్డే మ్యాచ్కి దూరంగా ఉంటాడని టాక్ వినిపించింది. అయితే అన్యూహ్యంగా అతన్ని జట్టులోకి తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ వ్యూహం ఆసీస్కి బాగా కలిసివచ్చింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?