శిఖర్ ధావన్ సెంచరీ మిస్... రాహుల్ ద్రావిడ్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ...
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు 197 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు చేసిన శిఖర్ ధావన్, బెన్ స్టోక్స్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి, మోర్గాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
స్వదేశంలో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (స్వదేశంలో 14192 పరుగులు) తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్గా నిలిచాడు...
ఓవరాల్గా స్వదేశంలో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆరో బ్యాట్స్మెన్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టాప్లో ఉండగా రికీ పాంటింగ్, జాక్వస్ కలీస్, కుమార సంగర్కర, జయవర్ధనే టాప్ 5లో ఉన్నారు...
అత్యంత వేగంగా స్వదేశంలో 10 వేల పరుగులు అందుకున్న బ్యాట్స్మెన్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. రికీ పాంటింగ్ 219 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించగా విరాట్ కోహ్లీ కేవలం 195 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
వన్డేల్లో 104వ సారి 50+ స్కోరు చేసిన విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వస్ కలీస్ (103 సార్లు)ను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ (145 సార్లు) టాప్లో ఉండగా కుమార సంగర్కర, రికీ పాంటింగ్ మాత్రమే విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...
ఇంగ్లాండ్పై అత్యధిక 50+ స్కోర్లు చేసిన రెండో భారత ప్లేయర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 32 సార్లు ఈ ఫీట్ సాధించగా, విరాట్ కోహ్లీ 27 సార్లు ఈ రికార్డు సాధించాడు. 26సార్లు ఈ ఫీట్ సాధించిన రాహుల్ ద్రావిడ్ను అధిగమించాడు కోహ్లీ.
కెప్టెన్గా స్వదేశంలో వన్డేల్లో 2000+ పరుగులు చేసిన రెండో భారత సారథిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ధోనీ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు...
శిఖర్ ధావన్తో కలిసి రెండో వికెట్కి 105 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన తర్వాత అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 6 పరుగులకే పెవిలియన్ చేరాడు.
సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్కి అదిల్ రషీద్ బౌలింగ్లో మొయిన్ ఆలీ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ లభించింది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు శిఖర్ ధావన్...
106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు చేసిన శిఖర్ ధావన్, బెన్ స్టోక్స్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి, మోర్గాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
96 బంతుల్లో 95 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఆ తర్వాత 3 పరుగులు చేయడానికి 10 బంతులు తీసుకున్నాడు. మరోవైపు కెఎల్ రాహుల్ కూడా పరుగులు చేయలేకపోవడంతో ఒత్తిడికి గురైన ధావన్, సెంచరీకి 2 పరుగుల ముంగిట అవుట్ అయ్యాడు.