విరాట్ కోహ్లీ కోసం కెఎల్ రాహుల్ను పక్కనబెట్టలేం కానీ... రోహిత్ శర్మ కామెంట్...
దాదాపు ఏడేళ్ల తర్వాత ఓపెనర్లుగా వచ్చారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. కీలకమైన ఆఖరి టీ20లో ఓపెనర్లుగా వచ్చిన ఈ స్టార్ జోడి, భారత జట్టు భారీ స్కోరు చేయడానికి బాటలు వేసింది. టీ20 వరల్డ్కప్లో కూడా ఓపెనర్గా రావాలనుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు...
కెప్టెన్ నిర్ణయంపై తాజాగా తన అభిప్రాయాన్ని ప్రకటించాడు వన్డే, టీ20 వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. ‘విరాట్ కోహ్లీ ఓపెనర్గా వస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మ్యాచ్ గెలవడానికి అప్పుడప్పుడూ కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది...
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందువస్తే భారత జట్టుకి మంచి జరుగుతుందంటే, అదే చేయనివ్వండి. జట్టుకి ఏది అవసరమో, ఏది మంచి చేస్తుందో మేం కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా...
బయట ఎవరేం అనుకుంటున్నారు... అనేది మాకు అనవసరం. ఎవరు ఆడాలి? ఎవరు ఆడకూడదు? అనేది నిర్ణయించే హక్కు, అధికారం కెప్టెన్కు ఉంటుంది...
మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ను తీసుకుని, వారికి అవకాశం ఇవ్వడం జట్టుకి చాలా అవసరం. వచ్చే వరల్డ్కప్కి ముందు పటిష్టమైన జట్టును తయారుచేయాలని అనుకుంటున్నాం...
ఇప్పటికైతే వరల్డ్కప్కి చాలా సమయం ఉంది. ఇప్పుడు టీ20 సిరీస్ ముగించాం కాబట్టి వన్డే సిరీస్పై దృష్టిపెడతాం. నాకు వన్డేల్లో అయితే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయకపోవచ్చు...
అదనపు బౌలర్ను ఆడించాలని అనుకున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ఒకరిని తొలగించాలని అనుకున్నాం. అప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు...
జట్టు అవసరం కోసం ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల బ్యాట్స్మెన్ కెప్టెన్గా ఉంటే విజయాలు సాధించడం చాలా సులువైపోతుంది...
పరిమిత ఓవర్ల క్రికెట్లో కెఎల్ రాహుల్ చాలా అమూల్యమైన ఆటగాడు. అతన్ని తప్పించాలని మేం అనుకోవడం లేదు. కానీ ఫామ్ని దృష్టిలో పెట్టుకుని బెస్ట్ ఎలెవన్ను ఆడించినప్పుడే విజయం దక్కుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.
‘ఒక్క మ్యాచ్లో పక్కనబెట్టినంత మాత్రాన కెఎల్ రాహుల్కి ఇక అవకాశం దొరకదని కాదు... అది ఒకే మ్యాచ్కి సంబంధించిన నిర్ణయం... వరల్డ్కప్ ఆరంభమయ్యే సమయానికి నిర్ణయంలో మార్పు రావచ్చు..
ఫామ్లోకి వచ్చి పరుగులు సాధిస్తూ ఉంటే, మళ్లీ కెఎల్ రాహుల్ తన స్థానంలోకి వస్తాడు. ఐపీఎల్ ఉంది, ఆ తర్వాత కూడా టీ20 వరల్డ్కప్కి చాలా సమయం ఉంది...
కాబట్టి టీ20 వరల్డ్కప్లో విరాట్ కోహ్లీయే ఓపెనర్గా వస్తాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం... అప్పటి పరిస్థితులను బట్టి అది ఆధారపడి ఉంటుంది...’ అని చెప్పాడు రోహిత్ శర్మ...