చెప్పినట్టే ఫైనల్ మ్యాచ్లో సిరాజ్ని ఆడించాం... అయితే సిరాజ్ అంటే ఒక్క ప్లేయర్ కాదు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మొదలయ్యే ముందు వరకూ తుదిజట్టులో మహ్మద్ సిరాజ్ ఉండడం ఖాయమని భావించారంతా. ఫైనల్ మ్యాచ్కి ఒకరోజు ముందే టీమిండియా తుదిజట్టును ప్రకటించినప్పటికీ , వర్షం కారణంగా తుదిజట్టులో మార్పులు జరుగుతాయని భావించారంతా...
టీమిండియా క్వారంటైన్ పీరియడ్ను పూర్తి చేసుకుని, నెట్ ప్రాక్టీస్ మొదలెట్టేముందు ఆన్లైన్ ద్వారా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు భారత సారథి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి...
ఈ ఇంటర్వ్యూ ప్రారంభం కాకముందు, మైక్లు ఆన్లో ఉండడంతో వారిద్దరి మధ్య జరిగిన ఓ సంభాషణకు సంబంధించిన ఆడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...
ఆ సమయంలో ఇంగ్లాండ్తో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఆ మ్యాచ్ను గమనిస్తూ మీడియా సమావేశానికి హాజరయ్యారు కోహ్లీ, రవిశాస్త్రి..
ఆ సమయంలో ‘వాళ్ల టీమ్లో లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నాం. మనం సిరాజ్తో ఓపెనింగ్ స్పెల్ వేయిద్దాం...’ అంటూ రవిశాస్త్రితో అన్నాడు విరాట్ కోహ్లీ, దానికి కోహ్లీ, ‘ఊ...’కొట్టాడు. ఈ ఆడియో వైరల్ కావడంతో ఫైనల్లో సిరాజ్ బరిలో దిగడం ఖాయమనుకున్నారంతా...
కేవలం ఆరేడు టెస్టుల అనుభవం ఉన్న మహ్మద్ సిరాజ్ కోసం 100 టెస్టులకు పైగా అనుభవం ఉన్న ఇషాంత్ శర్మను పక్కనబెట్టడం సరికాదని క్రికెట్ విశ్లేషకులు కామెంట్ చేశారు. సిరాజ్కి బదులు ఇషాంత్నే ఆడించాలని డిమాండ్ కూడా చేశారు...
అయితే టీమిండియా ప్రకటించిన జట్టు చూసి అంతా షాక్ అయ్యాడు. సిరాజ్ తుది జట్టులో ఉండడం గ్యారెంటీ అనుకున్నవారికందరికీ ఇషాంత్, షమీ, బుమ్రాల పేర్లు మాత్రమే ఉండడం చూసి చిన్న షాక్ తగిలినట్టైంది.
సిరాజ్ను ఆడిస్తారని న్యూజిలాండ్ ఫిక్స్ అయిపోయి, అతని బౌలింగ్ ఎదుర్కోవడానికి తెగ ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో విరాట్ అండ్ శాస్త్రి వేసిన ఎత్తుగడ ఇదని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్... సిరాజ్ ఫైనల్ టీమ్లో ఉంటాయని కివీస్ టీమ్ భావించాలనే ప్రాక్టీస్ సెషన్స్లో అతనితో దిగిన ఫోటోలను కూడా కోహ్లీ పోస్టు చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.
అయితే విరాట్ కోహ్లీ.. సిరాజ్ను ఆడిస్తానని చెప్పిన మాట అబద్ధం కాదని... అయితే సిరాజ్ అంటే ఒక్క ప్లేయర్ మాత్రమే కాదని వివరించి చెబుతున్నారు కొందరు అభిమానులు...
భారత జట్టులో చోటు దక్కించుకున్న షమీ (S), ఇషాంత్ (I), రవీంద్ర జడేజా (R), అశ్విన్ (A), జస్ప్రిత్ బుమ్రా (J) ప్లేయర్లలోని మొదటి అక్షరాలను కలిసి ‘SIRAJ’ అని చెప్పాడని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
తొలి సెషన్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన భారత బౌలర్లు, రెండో సెషన్లో మంచి కమ్బ్యాక్ ఇచ్చారు. టామ్ లాథమ్ను అశ్విన్ అవుట్ చేయగా, డివాన్ కాన్వేని ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు...