- Home
- Sports
- Cricket
- వినేశ్ ఫోగట్ కొత్త చరిత్ర.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన రెజ్లర్
వినేశ్ ఫోగట్ కొత్త చరిత్ర.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన రెజ్లర్
World Wrestling Championship 2022: సెర్బియా వేదికగా జరుగుతున్న ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ పతక బోణీ కొట్టింది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పతకంతో చరిత్ర సృష్టించింది.

సెర్బియాలోని బెల్గ్రేడ్ లో జరుగుతున్న సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షపి లో భారత్ బోణీ కొట్టింది. నాలుగు రోజుల నిరాశజనక ఫలితాల తర్వాత ఐదో రోజు భారత సీనియర్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పతకం నెగ్గింది.
మహిళల ఫ్రీ స్టయిల్ 53 కిలోల విభాగంలో ఫోగట్.. 8-0 తేడాతో ఎమ్మాజోనా మాల్మెగ్రెన్ (స్వీడన్) పై గెలిచింది. గత నెలలో ముగిసిన కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణం నెగ్గిన వినేశ్ ఫోగట్.. అదే ప్రదర్శనను కొనసాగిస్తూ కాంస్యం పోరులో పతకం సాధించడం విశేషం.
వాస్తవానికి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో వినేశ్.. మంగళవారమే తొలి రౌండ్ లో 0-7తో మంగోలియా కు చెందిన ఖులాన్ బత్కుయోగ్ చేతిలో ఓడింది. అయితే ఖులాన్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’విధానం ద్వారా వినేశ్ కు కాంస్య పతకంలో పోటీ పడే అవకాశం దక్కింది. ఈ విజయం ద్వారా ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్ర లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా వినేశ్ రికార్డు నెలకొల్పింది.
ఇక రెపిచాజ్ తొలి రౌండ్ లో వినేశ్4-0తో జుల్దిజ్ ఇషియోవా (కజకిస్తాన్) పై గెలిచి తర్వాతి రౌండ్ లో వాకోవర్ (ప్రత్యర్థి గాయంకారణంగా ఆడలేదు)లభించి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. ఈ పోరులో ఫోగట్.. ఎమ్మాజోనాను ఓడించింది.
ఇవే పోటీలలో భాగంగా 68 కిలోల విభాగంలో మరో భారత రెజ్లర్ నిషా దహియా.. సెమీస్ లో ఓడింది. సెమీఫైనల్లో నిషా.. 4-5 తేడాతో జపాన్ కు చెందిన అమీ ఇషి చేతిలో పరాజయం పాలైంది.