వరుణ్ చక్రవర్తి... వాట్ ఏ కమ్బ్యాక్... ప్రత్యర్థి టీమ్ కూడా ఫిదా...
IPL 2020 సీజన్లో అదిరిపోయే అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు వరుణ్ చక్రవర్తి. ఈ సీజన్లో మొట్టమొదటి 5 వికెట్ల ప్రదర్శన నమోదుచేసిన వరుణ్ చక్రర్తి, ఈ దశలో పలు రికార్డులను బద్ధలుకొట్టాడు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అదరగొట్టి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి...
![article_image2](https://static-ai.asianetnews.com/images/01endd7tm0me4ms2kxb570zw6d/fotojet-jpg_300x171xt.jpg)
దీంతో 2019 ఐపీఎల్ వేలంలో ఈ స్పిన్నర్ కోసం పలు ప్రాంఛైజీలు పోటీపడ్డాయి... రూ.8 కోట్ల 40 లక్షల భారీ ప్రైజ్కి వరుణ్ చక్రవర్తిని దక్కించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
అయితే గత ఏడాది పంజాబ్ తరుపున ఒకే మ్యాచ్ ఆడిన వరుణ్ చక్రవర్తి, ఒకే ఒక్క వికెట్ తీశాడు.
గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు వరుణ్ చక్రవర్తి. దాంతో మనోడిని వదులుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
ఐపీఎల్ 2020 వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో వచ్చిన వరుణ్ చక్రవర్తిని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది కోల్కత్తా నైట్రైడర్స్...
ఈ సీజన్లో ఇప్పటిదాకా 10 మ్యాచులు ఆడిన వరుణ్ చక్రవర్తి 12 వికెట్లు తీశాడు. 7.05 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 5 వికెట్లు తీసి, ఈ ఘనత సాధించిన రెండో కేకేఆర్ ప్లేయర్గా నిలిచాడు వరుణ్ చక్రవర్తి. ఇంతకుముందు విండీస్ సీనియర్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ ఈ ఫీట్ సాధించాడు.
5 వికెట్లు తీసి ఢిల్లీ పరాజయంలో కీలక పాత్ర పోషించినా... వరుణ్ చక్రవర్తి టాప్ క్లాస్ ప్రదర్శనకి అభినందనలు తెలిపింది ఢిల్లీ క్యాపిటల్స్...
అంకిత్ రాజ్పుత్ (2018) తర్వాత ఐదు వికెట్లు తీసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు వరుణ్ చక్రవర్తి...
ఈ భారీ స్కోరింగ్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం.