ఎలా చూసినా ‘ఈ సాలా కప్ నమ్దే’... 2021 ఐపీఎల్కి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ సెంటిమెంట్...
ప్రతీ సీజన్లాగే 2021 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల సందడి మొదలైంది. 13 సీజన్లుగా నిరాశపరుస్తున్నా, ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ మరోసారి ఆర్సీబీకి మద్ధతు ప్రకటిస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ వీరాభిమానులు... ఈసారి తమ జట్టు టైటిల్ గెలుస్తుందని చెప్పడానికి ఎన్నో సెంటిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు.
2019 ఐపీఎల్లో సీజన్ ఆరంభంలోనే డబుల్ హ్యాట్రిక్ పరాజయాలను అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గత సీజన్లో కాస్త మెరుగైన ప్రదర్శనే ఇచ్చింది. 2020 సీజన్లో మొదటి 9 మ్యాచుల్లో ఏడింట్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్, టైటిల్ ఫెవరెట్ ఆటతీరుతో ఆకట్టుకుంది.
ఆరంభశూరత్వంలా ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది... సీజన్ ఆరంభంలో సాధించిన విజయాల కారణంగా లక్కీగా ప్లేఆఫ్ చేరిన ఆర్సీబీ, ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది...
2021 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ గెలవడం పక్కా అంటున్నారు ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలుస్తుందని చెప్పడానికి గల కారణాలను, సెంటిమెంట్స్ను లెక్కలేసి చెబుతున్నారు...
2010లో ప్లేఆఫ్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాతి సీజన్లో ఫైనల్ మ్యాచ్ ఆడింది. అలాగే 2015లో ప్లేఆఫ్ చేరిన ఆర్సీబీ, ఆ తర్వాత సీజన్లో ఫైనల్లో అడుగుపెట్టింది...
అలా చూసుకుంటే 2020లో ప్లేఆఫ్ చేరిన ఆర్సీబీ, ఈసారి ఫైనల్ మెట్టు ఎక్కడం పక్కా అంటున్నారు విరాట్ కోహ్లీ అండ్ బెంగళూరు అభిమానులు...
అంతేకాకుండా గౌతమ్ గంభీర్, మహేంద్ర సింగ్ ధోనీ, డేవిడ్ వార్నర్ తండ్రి అయిన ఆడిన ఐపీఎల్ సీజన్లో టైటిల్ గెలిచారు. ఈ ఏడాది ఆరంభంలో తండ్రి అయిన విరాట్ కోహ్లీ, టైటిల్ గెలుస్తాడని అంటున్నారు...
ఇవేకాకుండా ఐపీఎల్ 2021 వేలంలో రూ.4 కోట్ల 80 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన డాన్ క్రిస్టియన్, ఇంతకుముందు ఆడిన లీగ్లన్నింటిలో టైటిల్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
ఇదే సెంటిమెంట్ కోసం టీ20 లీగ్ స్పెష్టలిస్ట్ ప్లేయర్ అయిన డాన్ క్రిస్టియన్ కోసం అంత భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధమైందట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఇలా 2021 సీజన్ ఆరంభానికి ముందు కూడా టైటిల్పై ఆశలు పెంచుకుంటున్నారు ఆర్సీబీ అభిమానులు. మరి ఈసారికూడా విరాట్ అభిమానులను నిరాశ పరుస్తాడో లేక టైటిల్ గెలిచి, ఐపీఎల్ టైటిల్ లేదనే లోటును తీర్చుకుంటాడో చూడాలి...