MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • భారత్ అంటే ఆ దేశానికి తప్ప అన్నింటికీ అసూయ.. ఈసారి వరల్డ్ కప్ వాళ్లకే అంటున్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్

భారత్ అంటే ఆ దేశానికి తప్ప అన్నింటికీ అసూయ.. ఈసారి వరల్డ్ కప్ వాళ్లకే అంటున్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్

ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్  వన్డే వరల్డ్ కప్ విజేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  భారత్ అంటే చాలా దేశాలకు అసూయ ఉందన్న స్వాన్..

2 Min read
Author : Srinivas M
Published : May 11 2023, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ఏడాది అక్టోబర్  నుంచి భారత్ వేదికగా జరుగబోయే   వన్డే వరల్డ్ కప్ గురించి  ఇప్పుడే  జోరుగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో ఫేవరేట్లు ఎవరు..? ఎవరు గెలుస్తారు..? తదితర అంశాలపై ఆటలోని నిపుణులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్   కూడా ఈ జాబితాలో చేరాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే అతడు ఎవరూ ఊహించని విధంగా అఫ్గానిస్తాన్ పేరు చెప్పడం విశేషం.  అందుకు గల కారణాలను కూడా అతడు వివరించాడు. రషీద్ ఖాన్,  నూర్ అహ్మద్ వంటి స్పిన్నర్లు ఉండటం వారికి  ఎంతో మేలే చేసేదని జియో సినిమాలో  వస్తున్న ఐపీఎల్ -16లో భాగంగా ఓ  చర్చలో  స్వాన్  అభిప్రాయపడ్డాడు. 

36

స్వాన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి భారత్ లో మణికట్టు స్పిన్నర్లు ఉన్నందుకు  క్రికెట్ ఆడే ప్రతి దేశం  అసూయపడుతుంది.  ఇక్కడ చాలా మంది  రిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు.  కానీ  ఆఫ్గానిస్తాన్ ఒక్కటే దానికి మినహాయింపు.       ఆ జట్టుకు  కూడా రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ల రూపంలో అద్భుతమైన  మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు.

46

ప్రపంచంలో  ఇప్పుడు వాళ్లిద్దరూ బెస్ట్ రిస్ట్ స్పిన్నర్స్ అని చెప్పక తప్పద.   ఈ ఇద్దరూ  ఆఫ్గాన్ జట్టుకు ఆస్తి.  వీళ్లిద్దరూ ఇదే ఫామ్ కొనసాగిస్తే  వచ్చే వన్డే వరల్డ్ కప్ ను  ఆప్గాన్ గెలచుకునే  అవకాశం లేకపోలేదు..’ అని అభిప్రాయపడ్డాడు. 

56

కాగా రషీద్, నూర్ లు ప్రస్తుతం గుజరాత్ తరఫున ఆడుతున్నారు.   నూర్ అహ్మద్ ఇప్పుడిప్పుడే ఐపీఎల్ లో అడుగులు వేస్తున్నా   రషీద్ ఖాన్ 2017 నుంచే  ఈ లీగ్ ఆడుతున్నాడు.  ఇప్పటివరకు   103 మ్యాచ్ లలో  103 వికెట్లు తీసిన  రషీద్.. ఈ సీజన్ లో  11 మ్యాచ్ లలో  19 వికెట్లు పడగొట్టాడు. 

66

ఇక ఈ ఏడాదిలోనే ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన నూర్ అహ్మద్.. 7 మ్యాచ్ లలో   11 వికెట్లు పడగొట్టాడు.  ఈ ఇద్దరూ కలిసి గుజరాత్  టైటాన్స్ కు 30 వికెట్లు పడగొట్టడం విశేషం.  మిడిల్ ఓవర్స్ లో  ఈ ఇద్దరూ  ఆ జట్టుకు కీలకంగా మారుతున్నారు. ఆ జట్టు విజయాలలో  నూర్, రషీద్ లది కీలక పాత్ర. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image2
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Recommended image3
సెమీఫైన‌ల్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మికి కార‌ణం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved