టీమిండియా చీఫ్ కోచ్ పదవికి 200 దరఖాస్తులు...కానీ పోటీ మాత్రం వీరి మధ్యే
First Published Aug 1, 2019, 4:43 PM IST
టీమిండియా కోచింగ్ సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఇప్పటికే బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఒక్క చీఫ్ కోచ్ పదవికోసమే దాదాపు 200 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందులో కొంతమందే ప్రధాన పోటీలో నిలవనున్నారు. వారెవరో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

టీమిండియా కోసం నూతన కోచింగ్ సిబ్బందిని నియమించడానికి బిసిసిఐ ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే బిసిసిఐ ప్రకటనకు భారీ స్పందన వచ్చింది. కేవలం ఒక్క చీఫ్ కోచ్ పదవికోసమే దాదాపు 200 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. జూలై 30తో దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో ఎంపిక ప్రక్రియను చేపడుతున్న సీఏసి బృందం ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా ఈ 200మందిని ఇంటర్వ్యూ చేసిన పిమ్మట టీమిండియా చీఫ్ కోచ్ గా ఒక్కరిని మాత్రమే ఫైనల్ చేయనున్నారు.

ఇలా భారీ సంఖ్యలో దేశ, విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నా ప్రధాన ఫోటీలో కొందమంది మాత్రమే నిలవనున్నారు. అలాంటి వారిలో ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి ముందు వరుసలో వున్నాడు. మళ్లీ భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు అతడికే ఎక్కువగా వున్నట్లు కనిపిస్తోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?