ఇరగదీసిన ఇషాన్ కిషన్, విరాట్ కమ్బ్యాక్ ఇన్నింగ్స్... టీమిండియా ఘన విజయం...
తొలి టీ20 మ్యాచ్లో అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైన విరాట్ సేన, రెండో టీ20 మ్యాచ్లో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చింది. కెఎల్ రాహుల్ డకౌట్ అయినా ఆరంగ్రేట బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఇరగదీయగా, ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ కోహ్లీ కమ్బ్యాక్ ఇన్నింగ్స్ ఆడాడు... ఫలితంగా 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది టీమిండియా.

<p>ఆరు బంతులాడిన కెఎల్ రాహుల్ డకౌట్ కావడంతో పరుగులేమీ చేయకుండా తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే మొదటి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ బౌండరీతో తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్ను ఆరంభించాడు...</p>
ఆరు బంతులాడిన కెఎల్ రాహుల్ డకౌట్ కావడంతో పరుగులేమీ చేయకుండా తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. అయితే మొదటి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ బౌండరీతో తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్ను ఆరంభించాడు...
<p>ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...</p>
ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...
<p>మొట్టమొదటి టీ20 మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదిన 8వ బ్యాట్స్మెన్గా, రెండో భారత బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్...</p>
మొట్టమొదటి టీ20 మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదిన 8వ బ్యాట్స్మెన్గా, రెండో భారత బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్...
<p>ఇంతకుముందు టీమిండియా తరుపున అజింకా రహానే మాత్రమే 2011లో మొదటి టీ20 మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదాడు. రహానే కూడా ఇంగ్లాండ్తోనే తొలి మ్యాచ్ ఆడగా, ఆ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులే చేయడం విశేషం. </p>
ఇంతకుముందు టీమిండియా తరుపున అజింకా రహానే మాత్రమే 2011లో మొదటి టీ20 మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదాడు. రహానే కూడా ఇంగ్లాండ్తోనే తొలి మ్యాచ్ ఆడగా, ఆ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులే చేయడం విశేషం.
<p>తొలి టీ20 మ్యాచ్లో 56 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్, అజింకా రహానే 61 తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. రోహిత్, ఊతప్ప కూడా తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసినా, వారికి మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. </p>
తొలి టీ20 మ్యాచ్లో 56 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్, అజింకా రహానే 61 తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. రోహిత్, ఊతప్ప కూడా తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసినా, వారికి మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు.
<p>ఆరంగ్రేటం మ్యాచ్లోనే 4 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 6 తర్వాత ఎంట్రీ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా నిలిచాడు...</p>
ఆరంగ్రేటం మ్యాచ్లోనే 4 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 6 తర్వాత ఎంట్రీ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా నిలిచాడు...
<p>సిక్సర్తో కెరీర్లో 26వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో 10+ హాఫ్ సెంచరీలు బాదిన కెప్టెన్గా కేన్ విలియంసన్తో కలిసి టాప్లో నిలిచాడు విరాట్ కోహ్లీ...</p>
సిక్సర్తో కెరీర్లో 26వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో 10+ హాఫ్ సెంచరీలు బాదిన కెప్టెన్గా కేన్ విలియంసన్తో కలిసి టాప్లో నిలిచాడు విరాట్ కోహ్లీ...
<p>26వ టీ20 హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, అత్యధిక టీ20 అర్ధశతకాలు బాదిన బ్యాట్స్మెన్గా టాప్లో నిలిచాడు. రోహిత్ శర్మ 25, డేవిడ్ వార్నర్ 19 హాఫ్ సెంచరీలతో టాప్ 3లో ఉన్నారు. </p>
26వ టీ20 హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, అత్యధిక టీ20 అర్ధశతకాలు బాదిన బ్యాట్స్మెన్గా టాప్లో నిలిచాడు. రోహిత్ శర్మ 25, డేవిడ్ వార్నర్ 19 హాఫ్ సెంచరీలతో టాప్ 3లో ఉన్నారు.
<p>రిషబ్ పంత్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ నెం.5 బ్యాట్స్మెన్గా రావడంతో సూర్యకుమార్ యాదవ్కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. </p>
రిషబ్ పంత్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ నెం.5 బ్యాట్స్మెన్గా రావడంతో సూర్యకుమార్ యాదవ్కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
<p>49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ 73 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా శ్రేయాస్ అయ్యర్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. జోర్డాన్ బౌలింగ్లో వరుసగా 4, సిక్సర్ బాది విజయాన్ని పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ. </p>
49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ 73 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా శ్రేయాస్ అయ్యర్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. జోర్డాన్ బౌలింగ్లో వరుసగా 4, సిక్సర్ బాది విజయాన్ని పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ.