ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్... టాస్ గెలిచిన రోహిత్ శర్మ...
ఓ వైపు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు లంకతో వన్డే మ్యాచ్ ఆడుతుంటే, ఇంగ్లాండ్ టూర్లో ఉన్న భారత జట్టు కౌంటీ ఎలెవన్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది...
కౌంటీ ఎలెవన్తో జరుగుతున్న ఈ ప్రాక్టీస్ మ్యాచ్కి భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది...
భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు, వైస్ కెప్టెన్ అజింకా రహానే కూడా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం లేదు. దాంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ దక్కింది...
రిషబ్ పంత్ కరోనా బారిన పడడం, వృద్ధిమాన్ సాహా ఐసోలేషన్లో ఉండడంతో కెఎల్ రాహుల్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్కి వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు...
అలాగే కౌంటీ మ్యాచుల్లో పాల్గొన్న భారత స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ మ్యాచ్లో పాల్గొనడం లేదు...
శుబ్మన్ గిల్ కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి దూరం కావడంతో మయాంక్ అగర్వాల్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్లలో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే, వారికి రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం రావచ్చు..
ప్రాక్టీస్ మ్యాచ్కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా,అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్