మన క్రికెటర్లు ఏం చదువుకున్నారో తెలుసా... బడి నుంచి బరిలో దిగిన టీమిండియా ప్లేయర్లు ఎవరంటే...
ప్రతీ భారతీయుడికి ఉండే రెండు కామన్ కాలక్షేపం సినిమా, క్రికెట్... ఆట వస్తే బ్యాటు పట్టుకుని క్రికెటర్గా ఎదగాలని కల కంటారు లేదా... యాక్టింగ్ వేస్తే కెమెరా ముందుకొచ్చి హీరోగా చెలరేగిపోవాలని ఆశపడతారు. పుస్తకం తీసి చదువుకొమ్మంటే అందరికీ గుర్తొచ్చే కామన్ డైలాగ్ కూడా ఇదే... ‘రామరావు ఏం చదివాడు? సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు?’ అని! మరి ఇప్పుడు టీమిండియాలో అదరగొడుతున్న మన క్రికెటర్లు ఏం చదివారో తెలుసా...
విరాట్ కోహ్లీ... ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్, యాటిట్యూడ్, స్టైల్తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే.
ఢిల్లీలోని విశాల్ భారతీ పబ్లిక్ స్కూల్లో చదివిన విరాట్, ఆ తర్వాత డిల్లీ సెవియర్ కాన్వెంట్ సెకండరీ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ తర్వాత క్రికెట్లో బిజీ కావడంతో చదువుకి స్వస్తి పలికాడు విరాట్.
మహేంద్ర సింగ్ ధోనీ... సచిన్ టెండూల్కర్ తర్వాత మాస్ జనాల్లో అంతటి క్రేజ్ తెచ్చుకున్న క్రికెటర్ ధోనీ మాత్రమే. టీమిండియాకు రెండు వరల్డ్కప్స్ అందించిన మహేంద్రుడు బికామ్ గ్రాడ్యూయేట్.
రాంఛీలోని డీఏవీ జవహార్ విద్యా మందిర్లో చదివిన ధోనీ, మొదట ఫుట్బాల్ జట్టుకి వికెట్ కీపర్గా వ్యవహారించాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పనిచేసిన ధోనీ, భారత జట్టుకు ఎంపిక కావడంతో సీన్ మారిపోయింది.
సచిన్ టెండూల్కర్... క్రికెట్ దేవుడిగా కీర్తి గడించిన సచిన్ టెండూల్కర్, పదో తరగతి ఫెయిల్ అయ్యాడని అంటారు. అయితే అది నిజం కాదు, సచిన్ టెండూల్కర్ 12వ తరగతి కూడా పాస్ అయ్యారు. షార్దర్శమ్ విద్యామందిర్లో చదివిన సచిన్ టెండూల్కర్, 16 ఏళ్లకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
యువరాజ్ సింగ్... ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2011 వరల్డ్కప్లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన యువరాజ్ సింగ్ కూడా 12వ తరగతి వరకూ చదువుకున్నారు.
రాహుల్ ద్రావిడ్... తన క్లాస్ ఆటతీరుతో కూల్ యాటిట్యూడ్తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్. ఈ మిస్టర్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ సెయింట్ జోసఫ్ కాలేజీలో ఎమ్బీఏ పూర్తిచేశారు.
అనిల్ కుంబ్లే... భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు క్రియేట్ చేసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే... మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన అనిల్ కుంబ్లే... భారత జట్టుకి కోచ్గా కూడా వ్యవహారించారు.
శిఖర్ ధావన్... తనదైన స్టైల్తో టీమిండియాలో స్టార్గా ఎదిగాడు ‘గబ్బర్’ శిఖర్ ధావన్. ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్గా నిలిచిన ధావన్... 12వ తరగతి పూర్తిచేశాడు.
వీవీఎస్ లక్ష్మణ్... భారత జట్టు తరుపున అద్భుతంగా రాణించిన హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. తన సొగసైన ఆటతీరుతో క్రికెట్ విమర్శకులను మెప్పించిన వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్మెన్ లక్ష్మణ్... మెడిసిన్ చదువును మధ్యలోనే వదిలేశారు. ఎమ్బీబీఎస్ చదువుతున్న సమయంలో భారత జట్టులో చోటు దక్కడంతో డాక్టర్ వృత్తిని వదిలి, క్రికెటర్గా సెటిల్ అయ్యారు వీవీఎస్ లక్ష్మణ్.
వీరేంద్ర సెహ్వాగ్... టెస్టు క్రికెట్లో రెండు త్రిబుల్ సెంచరీలు చేసిన భారత మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్. వీరూ న్యూఢిల్లీలోని జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాడు.
గౌతమ్ గంభీర్... భారత జట్టుకి రెండు వరల్డ్కప్స్ అందించిన బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్. కెప్టెన్గా ధోనీకి క్రెడిట్ ఎక్కువ దక్కినా 2007, 2011 ఫైనల్స్లో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్లు వెలకట్టలేనివి. గంభీర్ ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.
సౌరవ్ గంగూలీ... భారత జట్టు గతిని మార్చిన గొప్ప కెప్టెన్లతో సౌరవ్ గంగూలీ ముఖ్యుడు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా వ్యవహారిస్తున్న గంగూలీ... సెయింట్ జెవియర్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు.
అజింకా రహానే... విరాట్ కోహ్లీ గైర్హజరీతో టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు అజింకా రహానే. రహానే మహారాష్ట్రలోని ఎస్వీ జోషి హై స్కూల్లో పదో తరగతి పూర్తిచేశాడు. ఆ తర్వాత కామర్స్లో డిగ్రీ చేశాడు రహానే.
హార్ధిక్ పాండ్యా... భారత జట్టులో అద్భుత ఆల్రౌండర్గా కొనసాగుతున్నాడు హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున అదరగొడుతున్న హార్ధిక్ పాండ్యా చదివింది తొమ్మిదో తరగతి మాత్రమే. తొమ్మిదిలో ఫెయిల్ అయిన హార్ధిక్, ఆ తర్వాత చదువు కొనసాగించలేదు.
బుమ్రా... ప్రపంచ క్రికెట్లోనే అద్భుతమైన బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా. ఎన్నో కష్టాలను అధిగమించి క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా కూడా స్కూల్ నుంచి క్రికెట్ ఫీల్డ్లోకి అడుగుపెట్టినవాడే. అహ్మదాబాద్లోని నిర్మన్ హై స్కూల్లో పదో తరగతి పూర్తిచేసిన బుమ్రా, ఆ తర్వాత క్రికెట్పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు.
రవిచంద్రన్ అశ్విన్... అనిల్ కుంబ్లే తర్వాత ఆ రేంజ్లో ప్రదర్శన ఇస్తున్న బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఐటీ) పూర్తిచేశాడు.
మహమ్మద్ సిరాజ్... తండ్రి చనిపోయిన వార్త తెలిసినా కూడా భారత జట్టుతో కొనసాగాలని నిర్ణయించుకున్న హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్... నాంపల్లిలోని సఫా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియన్ పూర్తిచేశాడు.
కెఎల్ రాహుల్... రోహిత్ శర్మ గైర్హజరీతో టీ20, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్గా నియమితుడైన కెఎల్ రాహుల్, ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ సాధించిన విషయం తెలిసిందే. లోకేశ్ రాహుల్ కూడా బీకామ్ డిగ్రీ పూర్తిచేశాడు..
రోహిత్ శర్మ... వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్ ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్కి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ కూడా కేవలం ఇంటర్మీడియట్తోనే చదువును ఆపేశాడు. క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా స్కాలర్షిప్ పొందిన రోహిత్... స్వామి వివేకానంద స్కూల్లో చదివాడు.