MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • TATA IPL: ఎక్స్ట్రాలు ఇస్తే అంతే మరి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదుచేసిన ఆర్సీబీ..

TATA IPL: ఎక్స్ట్రాలు ఇస్తే అంతే మరి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదుచేసిన ఆర్సీబీ..

TATA IPL 2022: ఆదివారం పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో ఆర్సీబీ 200 ప్లస్  స్కోరు చేసినా ఓడిన సంగతి తెలిసిందే. 

1 Min read
Author : Srinivas M
Published : Mar 28 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ ఈ సీజన్ ఘనంగా ఆరంభించాలని అనుకుంది. అయితే ఆ మేరకు  తొలుత బ్యాటింగ్ చేసి మెరుపులు మెరిపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లి (41 నాటౌట్), దినేశ్ కార్తీక్ (32 నాటౌట్) లు రెచ్చిపోయి ఆడటంతో  నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ ముందు 206 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 

37

అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ ఏం తక్కువ తిన్లేదు.  ఓ ప్రణాళిక ప్రకారం ఆడిన పంజాబ్..  మరో 6 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే పంజాబ్ విజయంలో ఆర్సీబీ  బౌలర్లు ఇచ్చిన పరుగులతో పాటు  ఆ జట్టు చేసిన కీలక తప్పిదం కూడా కారణమైంది. 

47

ఈ మ్యాచులో ఆర్సీబీ ఏకంగా 39 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో పంజాబ్ కు సమర్పించుకుంది. వైడ్ లు,  లెగ్ బైలు, ఓవర్ త్రో ల రూపంలో 39 పరుగులు వచ్చాయి. పంజాబ్ విజయానికి ఇవి కూడా కారణమయ్యాయి. 

57

కాగా,  నిన్నటి  మ్యాచులో ఓటమితో పాటు  ఓ చెత్త రికార్డును కూడా ఆర్సీబీ మూట గట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఎక్స్ట్రా లు ఇచ్చిన జట్టుగా  బెంగళూరు నిలిచింది. గతంలో ఈ రికార్డు..  డెక్కన్ ఛార్జర్స్ పేరిట ఉండేది. 

67

2008లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో డెక్కన్ ఛార్జర్స్.. 38 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో సమర్పించుకుంది. ఇక ఈ జాబితాలో తర్వాత పంజాబ్ కింగ్స్ కూడా నిలిచింది. 2010 సీజన్ లో   ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓ మ్యాచులో పంజాబ్ కూడా 38 పరుగులు అదనంగా ఇచ్చుకుంది. 

77

ఇప్పుడు ఆర్సీబీ ఈ రెండు జట్ల రికార్డులను బద్దలుకొట్టి అగ్రస్థానానికి చేరుకోవడం గమనార్హం.   ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగులలో 39 పరుగులు అదనంగా రాగా.. ఇక పంజాబ్ చేసింది 167 పరుగులే.. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే !
Recommended image2
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Recommended image3
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved