MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • TATA IPL: ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు కుర్రాళ్లు ఎంతమంది..? ఏ ఏ జట్టులో ఉన్నారు..?

TATA IPL: ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు కుర్రాళ్లు ఎంతమంది..? ఏ ఏ జట్టులో ఉన్నారు..?

TATA IPL 2022 Updates: బీసీసీఐ ఆధ్వర్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-15 సీజన్ మరికొద్దిగంటల్లో మొదలుకానుంది. దేశ, విదేశాల నుంచి  ఆటగాళ్లు ఆడుతున్న ఈ  మెగా లీగ్ లో మన తెలుగు కుర్రాళ్లు ఎంతమంది...? 

1 Min read
Srinivas M
Published : Mar 26 2022, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్-2022 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. శనివారం  సాయంత్రం ఈ మెగా సీజన్  ను ఆరంభించడానికి  డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధమవుతున్నాయి.  మరి  దేశ విదేశాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడుతున్న తెలుగు కుర్రాళ్లు ఎంతమంది..? వాళ్లు ఏ ఏ జట్టు తరఫున ఆడుతున్నారో ఇక్కడ చూద్దాం. 

26

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవలే బెంగళూరు వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలం ప్రక్రియలో 23 మంది (మొత్తం 370 మంది భారతీయులలో)  తెలుగు కుర్రాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

36

ఐపీఎల్ వేలంలో పాల్గొన్న వారిలో (హైదరాబాద్ నుంచి) హనుమా విహారి, తిలక్ వర్మ, బి. సందీప్, తన్మయ్ అగర్వాల్, తన్హయ్ త్యాగరాజన్, సివి మిలింద్, రాహుల్ బుద్ధి, యుద్వీర్, కార్తీకేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీష్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వల్, ఎండీ అఫ్రిది ఉన్నారు. 

46

ఇక ఆంధ్రా నుంచి... అంబటి రాయుడు, అశ్విన్ హెబ్బర్్, రికీ భుయ్, హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్, స్టీఫెన్, బండారు అయ్యప్ప, గిరినాథ్ రెడ్డిలు వేలంలో పాల్గొన్నారు. 

56

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 23 మంది వేలానికి వచ్చినా వారిలో ఏడుగురు మాత్రమే ప్రస్తుతం  ఐపీఎల్-2022 సీజన్ లో ఆడుతున్నారు.  వారిలో ఆంధ్రా నుంచి అంబటి రాయుడు, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమవ్వగా..  కెఎస్ భరత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.

66

ఇక హైదరాబాద్ నుంచి మహ్మద్ సిరాజ్, సివి మిలింద్ లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమవ్వగా.. రాహుల్ బుద్ది, ఠాకూర్ తిలక్ వర్మలు ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు
Recommended image2
డికాక్ రాకతో డేంజరస్‌గా ముంబై.. ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే మతిపోతుంది
Recommended image3
వీళ్లే లచ్చిందేవి వారసులు.. ఐపీఎల్‌లో కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్స్ లిస్టు ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved