టీ20 వరల్డ్కప్ సైట్లో ఆ విషయం మరిచిన ఐసీసీ... రోహిత్ శర్మ ఫ్యాన్స్ అప్సెట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సంబంధించిన టికెట్లను దాదాపు 8 నెలల ముందే అమ్మకానికి పెట్టేసింది ఐసీసీ. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి కూడా...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది... దాయాదుల పోరుకి ప్లేస్ మారినా, క్రేజ్ మాత్రం తగ్గలేదు...
ఈ మ్యాచ్కి బుకింగ్ మొదలెట్టగానే టికెట్లన్నీ కొన్ని నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. దాదాపు 50 వేల టికెట్లు బ్లాక్ మార్కెట్లోకి కూడా వచ్చేసినట్టు సమాచారం...
టీ20 వరల్డ్కప్ 2022 టోర్నీలో టికెట్ల విక్రయ సైట్లో ఏ మ్యాచ్కి సంబంధించి ఇరుదేశాల కెప్టెన్ల ఫోటోలను పోస్ట్ చేయడం ఆనవాయితీ...
అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో బాబర్ ఆజమ్తో పాటు విరాట్ కోహ్లీ ఫోటోనే కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, క్రేజ్ మాత్రం తగ్గలేదు...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ, ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నా... ఐసీసీ కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు...
అందుకే రోహిత్ శర్మకు బదులుగా విరాట్ కోహ్లీని కెప్టెన్గా చూపిస్తూ ఫోటోలను, వెబ్సైట్ని డిజైన్ చేశారు. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు...
ఐసీసీ టైటిల్ తెస్తాడనే ఆశతో, నమ్మకంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగిస్తే... ఆ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), క్రికెట్ ఆస్ట్రేలియా కానీ గుర్తించడం లేదని వాపోతున్నారు ఫ్యాన్స్...