MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కివీస్ ఓడితే, వాళ్లను ఆపడం మా వల్ల కాదు... పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్

కివీస్ ఓడితే, వాళ్లను ఆపడం మా వల్ల కాదు... పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆఫ్ఘాన్, స్కాట్లాండ్‌లపై భారీ విజయాలు అందుకున్న భారత జట్టు ఆశలన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌పైనే పెట్టుకుంది...

2 Min read
Chinthakindhi Ramu
Published : Nov 06 2021, 03:10 PM IST| Updated : Nov 06 2021, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ ఇరగదీసి 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదుచేసింది...

210

పసికూన స్కాట్లాండ్ జట్టును 85 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, ఆ లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ జెట్ స్పీడ్ ఛేజింగ్ కారణంగా నెట్ రన్‌రేట్‌ మెరుగుపర్చుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది టీమిండియా...

310

అయితే భారత జట్టు సెమీస్ చేరాలంటే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫలితం కీలకం కానుంది. పసికూన ఆఫ్గాన్, న్యూజిలాండ్‌పై ఎలాగైనా విజయం సాధిస్తేనే... భారత జట్టుకి సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి...

410

న్యూజిలాండ్‌పై ఆఫ్ఘాన్ విజయం సాధిస్తే... న్యూజిలాండ్, ఆఫ్ఘాన్, టీమిండియా (నమీబియాపై విజయం సాధిస్తే) జట్లు ఆరేసి పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా సాధించే విజయం మార్జిన్, ప్లేఆఫ్స్ బెర్తును కన్ఫార్మ్ చేస్తుంది...

510

‘ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే చాలా అనుమానాలు రేగుతాయి. చాలామందికి న్యూజిలాండ్‌తో పాటు ఆఫ్ఘాన్, ఐసీసీ, బీసీసీఐ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది...

610

కచ్ఛితంగా న్యూజిలాండ్ ఓడిపోతే మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నేను వివాదాలు లేకుండా టోర్నీ ముగియాలని అనుకుంటున్నా. ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతే, పాకిస్తాన్ జనాలు వారిని ఏ మాత్రం వదిలిపెట్టరు...

710

ఎందుకంటే న్యూజిలాండ్, ఆఫ్ఘాన్ కంటే చాలా మంచి టీమ్. వారికి చాలా అనుభవం ఉంది. ఎన్నో టోర్నీలు గెలిచారు. డబ్ల్యూటీసీ టైటిల్ కూడా గెలిచారు. కాబట్టి వారికి ఆఫ్ఘాన్‌ని ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోవదు..

810

కానీ న్యూజిలాండ్ ఓడిపోతే సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రజలు సృష్టించే రచ్చను ఆపడం మా వల్ల కాదు. భారత జట్టు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ పోటీలో ఉండడం చాలా మంచి పరిణామం...

910

ఇండియా ప్లేఆఫ్స్ చేరితే, టోర్నీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి చూసే అవకాశం దొరుకుతుంది. అదే జరిగితే క్రికెట్‌కి, కుర్రాళ్లకీ మంచి జరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్..

1010

ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయం అందుకున్న తర్వాత ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారంటూ ఆరోపిస్తూ, సోషల్ మీడియాలో ‘ఫిక్సింగ్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు పాక్ జనాలు... ఈసారి కూడా అలాగే జరుగుతుందని అంటున్నాడు అక్తర్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
Recommended image2
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే
Recommended image3
IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved