రెండు చేతులతో చేయాల్సినదాన్ని ఒక్కచేత్తో చేస్తే... రిషబ్ పంత్పై ఊర్విశి క్రేజీ పోస్ట్...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో టీమిండియా ప్లేఆఫ్స్ అవకాశాల కోసం మిగిలిన జట్లపై ఆధారపడాల్సి పరిస్థితుల్లో పడింది. అయితే పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో, ఆఫ్ఘాన్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది...
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన రిషబ్ పంత్, 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీతో కలిసి 53 పరుగులు అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి ఆకట్టుకున్నాడు...
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 19 బంతులాడిన ఒక్క బౌండరీ కొట్టలేక 12 పరుగులు మాత్రమే చేసిన రిషబ్ పంత్, ఆఫ్ఘాన్తో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చి 13 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు...
భారత మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి హెలికాఫ్టర్ షాట్లా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి సింగిల్ హ్యాండ్తో సిక్సర్ బాదడం చాలా ఇష్టం. ఇంగ్లాండ్ టూర్లో, ఆస్ట్రేలియా టూర్లో ఇలాంటి సిక్సర్లతో అదరగొట్టాడు పంత్...
రిషబ్ పంత్ సింగిల్ హ్యాండ్ సిక్సర్లపై అతని మాజీ గర్ల్ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లా. ‘రెండు చేతులతో పని చేయడం చాలా కామన్. అయితే సింగిల్ హ్యాండ్తో చేయడం మాత్రం అద్భుతం...’ అంటూ ఇన్స్టాలో పోస్టు చేసింది...
ఊర్వశి ఎవరి గురించి ఈ మాట చెప్పింది, ఎందుకు సింగిల్ హ్యాండ్ గురించి ప్రస్తావించిందనేదానికి గురించి చెప్పకపోయినా... ‘ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్’ అంటూ హ్యాష్ట్యాగ్ ఇవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్కి క్లారిటీ వచ్చేసింది...
బాలీవుడ్లో హాట్ బాంబ్గా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి రౌతెల్లా, 2018 సమయంలో రిషబ్ పంత్తో డేటింగ్ చేసింది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఊర్వశిని వాట్సప్లో బ్లాక్ చేసేశాడు రిషబ్ పంత్...
ఆమెతో సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేకనే ఊర్వశిని రిపబ్ పంత్ వాట్సాప్లో బ్లాక్ చేశాడని బాలీవుడ్ టాక్... ఆ తర్వాత ఇషా నేగీ అనే మోడల్తో రిలేషన్లో ఉన్నట్టు ప్రకటించాడు రిషబ్ పంత్...
రిషబ్ పంత్ తనని దూరం పెడుతున్నా, అతనికి దగ్గర కావాలని మరోసారి ప్రయత్నిస్తోంది ఊర్వశి. అందులో భాగంగానే టీమిండియా మ్యాచులకు కూడా హాజరవుతోంది ఊర్వశి...
కొన్నాళ్ల కిందట మడ్ బాత్ పేరుతో నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఊర్వశి, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’,‘హేట్ స్టోరీ 4’ వంటి అడల్ట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది... ప్రస్తుతం ‘బ్లాక్ రోస్’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఊర్వశి...