నటరాజన్కి కరోనా పాజిటివ్, అతనితో పాటు మరో ఆరుగురు... నేటి మ్యాచ్కి లైన్ క్లియర్...
ఐపీఎల్ 2021 సీజన్ను కరోనా భూతం వదిలేలా కనిపించడం లేదు... ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్కి ముందు నిర్వహించిన పరీక్షల్లో సన్రైజర్స్ ప్లేయర్ నటరాజన్కి కరోనా పాజిటివ్ వచ్చింది...
నటరాజన్కి ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం నట్టూని ఐసోలేషన్కి తరలించిన అధికారులు, అతనితో మరో ఆరుగురు క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్నట్టు గుర్తించారు...
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ విజయ్ శంకర్, టీమ్ మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్, డాక్టర్ అంజన వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ కేద్కర్, నెట్ బౌలర్ పెరియస్వామి గణేశన్... నట్టూతో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా గుర్తించారు... ముందుజాగ్రత్తగా నట్టూతో పాటు వీళ్లు కూడా ఐసోలేషన్లో గడపనున్నారు...
మిగిలిన ప్లేయర్లకు రెండు సార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో నేటి సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సజావుగా సాగుతుందని ప్రకటించింది ఐపీఎల్ యాజమాన్యం...
ఐపీఎల్ 2020 సీజన్లో యార్కర్లతో అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన నటరాజన్, ఆ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు...
ఆస్ట్రేలియా టూర్లో వన్డే, టీ20, టెస్టుల్లో ఆరంగ్రేటం చేసి రికార్డు క్రియేట్ చేసిన నట్టూ, ఆ పర్యటన తర్వాత గాయాలతో బాధపడుతూ జట్టుకి దూరమయ్యాడు...
గాయం కారణంగానే ఐపీఎల్ 2021 ఫేజ్ 1కి దూరమైన నటరాజన్, దాని నుంచి కోలుకుని ఫేజ్ 2లో సత్తా చాటాలని భావించాడు. అయితే ఈసారి కరోనా అతన్ని ఆశలపై నీళ్లు చల్లింది...
ఇప్పటికే ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది...