విరాట్, రోహిత్, రిషబ్ పంత్ల కంటే అతను తక్కువేమీ కాదు... ఆశీష్ నెహ్రా కామెంట్...
సూర్యకుమార్ యాదవ్... ఈ మధ్యకాలంలో ఫార్మాట్కి సంబంధం లేకుండా, ప్రత్యర్థి ఎవరనేది లెక్కచేయకుండా అదరగొడుతున్న భారత క్రికెటర్. ఇంగ్లాండ్తో సిరీస్ ద్వారా టీ20 ఎంట్రీ, లంకతో సిరీస్ ద్వారా వన్డే ఎంట్రీ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్...
లేటుగా ఎంట్రీ ఇచ్చినా, అంతర్జాతీయ క్రికెట్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాది గ్రాండ్ వెల్కం చెప్పుకున్న సూర్యకుమార్ యాదవ్, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు.
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్, భారత జట్టు డీసెంట్ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు...
‘లంక టూర్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. అన్నింటిలోనూ సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న విధానం నాకెంతో నచ్చింది. అతను ఆడిన ఆఖరి రెండు ఇన్నింగ్స్లు అమూల్యమైనవి...
అతను తనకి లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. అయితే ఇరుజట్ల మధ్య ఉన్న ప్రధానమైన తేడా గురించి చెప్పాలంటే అది సూర్యకుమార్ యాదవే...
ముంబై ఇండియన్స్ తరుపున ఓపెనింగ్ చేశాడు. వన్డౌన్లో వచ్చాడు. నాలుగో స్థానంలో వచ్చాడు. లోయర్ ఆర్డర్లో కూడా ఆడాడు...
ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా సింగిల్స్ తీస్తూనే బౌండరీలు బాదడం సూర్యకుమార్ యాదవ్ స్పెషాలిటీ. అతని బ్యాటింగ్లో కనిపించే కాన్ఫిడెన్స్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే...
ఇప్పుడున్న జట్టులో ఓ బ్యాట్స్మెన్ పేరు చెప్పమంటే నేను కచ్ఛితంగా సూర్యకుమార్ యాదవ్ పేరు చెబుతాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యాలకంటే అతను ఎందులోనూ తక్కువ కాదు....
వీరితో సమానమైన టాలెంట్, సూర్యకుమార్ యాదవ్ సొంతం. అవకాశం వచ్చిన ప్రతీసారి తనని తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు...
బ్యాటింగ్ పొజిషన్తో సంబంధం లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా తనని తాను మలుచుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెట్ ఆశీష్ నెహ్రా...
అంతర్జాతీయ క్రికెట్లో మొదటి మూడు టీ20 ఇన్నింగ్స్లు ముగిసిన తర్వాత 100+ పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గానూ నిలిచాడు.
ఇంతకుమందు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మొదటి మూడు టీ20 ఇన్నింగ్స్ల్లో కలిసి 109 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 139 పరుగులతో అతన్ని అధిగమించాడు.
గౌతమ్ గంభీర్ తర్వాత మొదటి మూడు టీ20 ఇన్నింగ్స్ల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, ఐపీఎల్లో 108 మ్యాచులు ఆడి 2197 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.