సచిన్ టెండూల్కర్ ముందే రాహుల్ ద్రావిడ్ పేరు చెబుతావా... సురేష్ రైనాని టీజ్ చేసిన యువరాజ్ సింగ్..
2007 - 2013 మధ్య కాలంలో టీమిండియా మూడు ఐసీసీ టోర్నీలు గెలిచింది. దీనికి కారణం సచిన్, సెహ్వాగ్, గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ధోనీ వంటి ప్లేయర్లతో టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా ఉండేది..
2005లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగ్రేటం చేసిన సురేష్ రైనా, ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2022 సెప్టెంబర్లో ఐపీఎల్తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు...
‘2005లో రాహుల్ భాయ్ (ద్రావిడ్) చేతుల మీదుగా ఇండియన్ క్యాప్ అందుకున్నా. అప్పుడు టీమ్లో ఉన్న సచిన్ పాజీ, వీరూ పా, దాదా, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ భాయ్, అషు భాయ్ (ఆశీష్ నెహ్రా), అనిల్ భాయ్ (కుంబ్లే), యువీ, భజ్జూ (ఎమ్మెస్ ధోనీ), ఇర్ఫాన్ పఠాన్ ముందు స్పీచ్ ఇవ్వాలి..
వీరిలో ధోనీ ఒక్కడే నా కంటే కాస్త ముందు టీమ్లోకి వచ్చాడు. మిగిలినవారంతా చాలా సీనియర్లు. అందుకే స్పీచ్ ఇచ్చేటప్పుడు తడబడ్డాను. ఎలాగోలా సర్దుకుని సీరియస్గా ఏదో చెబుతుంటే మధ్యలో యువీ నన్ను ఆపాడు..
నీ ఫెవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పు? అని అడిగాడు. నేను వెంటనే ఏమీ ఆలోచించకుండా నా ఐడల్ రాహుల్ సర్ అని చెప్పాను. దానికి వెంటనే ‘‘వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మెన్, గాడ్ ఆఫ్ క్రికెట్ ఇక్కడ ఉంటే, నువ్వు రాహుల్ పేరు చెబుతావా? ఆయన నీ ఫెవరెట్ కాదా?’’ అంటూ నన్ను టీజ్ చేసే ప్రయత్నం చేశాడు..
అయితే నేను వెంటనే సచిన్ పాజీ కూడా నా ఫెవరెట్లలో ఒకరు. కానీ నా గోడ మీద రాహుల్ ద్రావిడ్ ఫోటో ఉంటుందని చెప్పా. అది చాలా సరదాగా సాగింది. వాళ్లంతా నా మీద ఐస్ వేశారు... ఆ మూమెంట్స్ ఎప్పటికీ మరిచిపోలేను..’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా..
టీ20ల్లో 6 వేలకు పైగా మొట్టమొదటి భారత క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేసిన సురేష్ రైనా, ఐపీఎల్లో 5 వేలకు పైగా పరుగులు చేసిన మొదటి క్రికెటర్ కూడా. ఐపీఎల్లో 107 క్యాచులు అందుకున్న రైనా, అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్గా ఉన్నాడు.