ICC WTC Final: అవసరమైతే టాస్ ముందు కూడా జట్టులో మార్పులు... - సునీల్ గవాస్కర్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టును 24 గంటల ముందుగానే ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది టీమిండియా. వర్షం కారణంగా తొలి రోజు ఆట ఆలస్యం కావడంతో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
నిన్న విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి మీడియా సమావేశం ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో ఫైనల్ ఆడే తుది 11 మందిని ప్రకటించింది భారత జట్టు. అందరూ ఆశించినట్టే ది బెస్ట్ టీమ్ ఎలెవన్ను ఫైనల్ కోసం సెలక్ట్ చేసింది...
అయితే టాస్కి ముందు అవసరమైతే టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...
‘భారత జట్టు ఎలెవన్ టీమ్ను ప్రకటించింది. అయితే ఇంకా దాన్ని రిఫరీకి అందచేయలేదు. కాబట్టి పిచ్ కండీషన్స్, వాతావరణం లెక్కలోకి తీసుకుని వాళ్లు తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తే... టాస్లోపు ఆ మార్పులు చేయొచ్చు’ అంటూ కామెంట్ చేశాడు గవాస్కర్.
భారత జట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు బదులుగా ఆస్ట్రేలియా టూర్లో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్కి చోటు కల్పిస్తారని వార్తలు వినిపించాయి... అయితే ఫైనల్కి ఇషాంత్ శర్మను ఎంపిక చేసినట్టు ప్రకటించింది టీమిండియా...
అలాగే ఇంగ్లాండ్లోని సౌంతిప్టన్ వాతావరణ మార్పులకు అనుగుణంగా రవీంద్ర జడేజాకి బదులుగా నలుగురు పేసర్లు లేదా అదనంగా మరో బ్యాట్స్మెన్ను ఆడించబోతున్నారని కూడా ప్రచారం జరిగింది...
ఒకవేళ టాస్ సమయానికి భారత జట్టులో మార్పులు చేయాలని భావిస్తే... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి ఏ మార్పులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మహ్మద్ సిరాజ్ను జట్టులోకి చేర్చడం, జడేజాను తుది జట్టు నుంచి తప్పించడం వంటి మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్కి భారత జట్టు ప్రకటించిన జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింకా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా.