సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వీక్గా ఉంది... ఏబీ డివిల్లియర్స్ షాకింగ్ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కి శుభారంభం దక్కలేదు. కోల్కత్తా నైట్రైడర్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో 188 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన సన్రైజర్స్ హైదరాబాద్, 177 పరుగులకి పరిమితమైంది. రెండో మ్యాచ్లోనూ సన్రైజర్స్కి గెలవనివ్వమని అంటున్నాడు ఆర్సీబీ వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్...
చెన్నైలోని ఏంఎ చిదంబరం స్టేడియం వేదికగా ఏప్రిల్ 14న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది...
‘సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నా... ఇదో గొప్ప ఛాలెంజ్. సన్రైజర్స్తో ఆడడాన్ని నేనెప్పుడూ ఎంజాయ్ చేస్తాను...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన జట్లతో పోలిస్తే సన్రైజర్స్ హైదరాబాద్కి బ్యాటింగ్లో డెప్త్ లేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఒకటి, రెండు వికెట్లు తీస్తే, సన్రైజర్స్ని ఈజీగా కట్టడి చేయొచ్చు...
ఇప్పటికే మొదటి మ్యాచ్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ను గెలవనివ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఒక్క విజయం వస్తే వాళ్లు చాలా డేంజరస్గా మారతారు...
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఎలాంటి బ్యాట్స్మెన్నైనా ఛాలెంజ్ చేస్తూ, స్మార్ట్ గేమ్ ఆడిస్తారు...
సన్రైజర్స్ హైదరాబాద్పై ఆధిక్యం దక్కించుకోవాలంటే చిన్నచిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ, మంచి స్కోరు సాధించాల్సి ఉంటుంది... అప్పుడే బౌలింగ్ పటిష్టంగా ఉన్నజట్టుపై నిజమైన ఆధిక్యం సంపాదించగలుగుతాం...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్...
ముంబై ఇండియన్స్తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విజయాన్ని అందించాడు ఏబీ డివిల్లియర్స్...
160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్,.. విరాట్ కోహ్లీ 33, గ్లెన్ మ్యాక్స్వెల్ 39 ఇన్నింగ్స్ల కారణంగా ఈజీగా విజయం సాధిస్తుందని అనిపించినా... ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది...
అయితే 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయతీరాలకు చేర్చాడు...
మరోవైపు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మనీశ్ పాండే 61, బెయిర్ స్టో 55 పరుగులతో రాణించినా... డెత్ ఓవర్లలో భారీ షాట్లు కొట్టే ప్లేయర్ లేకపోవడంతో పరాజయాన్ని చవిచూసింది సన్రైజర్స్ హైదరాబాద్...