MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇద్దరికీ రెస్ట్, ఏడుగురికి బెడ్ రెస్ట్... ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు కావాలనే?...

ఇద్దరికీ రెస్ట్, ఏడుగురికి బెడ్ రెస్ట్... ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు కావాలనే?...

ఐపీఎల్... ప్రపంచానికి ఏం చేసిందో తెలీదు కానీ భారత జట్టుకి ఎందరో టాలెంటెడ్ క్రికెటర్లను అందించింది. అయితే ఐపీఎల్ కారణంగానే చాలామంది ప్లేయర్లు, గాయాలతో కీలక టోర్నీలకు దూరమయ్యారు...

3 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 27 2022, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
123

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ మ్యాచులను టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు నిర్వహించడం వల్లే బాగా అలసిపోయామని స్వయంగా భారత క్రికెటర్లే కామెంట్ చేశారు...

223

ఐపీఎల్ 2022 సీజన్ అయితే ఏకంగా రెండున్నర నెలల పాటు సాగనుంది. మార్చి 26 నుంచి మొదలై, మే 29 వరకూ నిరవధికంగా జరిగే ఈ మెగా టోర్నీకి ముందు కీలక ఆటగాళ్లు గాయపడడం విశేషం...
 

323

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, గాయం నుంచి కోలుకోవడానికి మూడున్నర నెలల సమయం పట్టింది...

423

కెఎల్ రాహుల్ కూడా రోహిత్ శర్మనే ఫాలో అవుతూ ఫిట్‌నెస్‌పై ఏ మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. గాయంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమైన కెఎల్ రాహుల్, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో పాల్గొన్నాడు. అయితే మళ్లీ విండీస్ టూర్‌లో గాయపడ్డాడు...

523

కెఎల్ రాహుల్ గాయాలతో సగం మ్యాచులకు దూరం అవుతుండడం... అదే సమయంలో వేరే ఈవెంట్లలో ప్రత్యేక్షం అవుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

623

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కి మాజీ సారథి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లకి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. నిజానికి గత ఏడాదిగా పర్ఫెక్ట్‌గా ఫిట్‌నెస్ మెయింటైన్, జట్టుకి పూర్తిగా అందుబాటులో ఉంటోంది ఈ ఇద్దరే...

723

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకి విరాట్ కోహ్లీ వెన్నునొప్పి వంకతో దూరంగా ఉన్నా, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న అతను... కావాలనే ఆ మ్యాచ్ ఆడలేదనేది చాలామందికి తెలిసిన విషయమే...

823

అప్పుడెప్పుడో కరోనా బారిన పడిన స్పిన్నర్ అక్షర్ పటేల్, దాని నుంచి కోలుకున్నా... ఫిట్‌నెస్‌ని సాధించలేక విండీస్‌తో సిరీస్‌కి దూరమయ్యాడు...

923

ఇంగ్లాండ్ టూర్‌కి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పరిస్థితి కూడా దాదాపు ఇదే...

1023

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడిన సుందర్, గాయపడి టీ20 సిరీస్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కి అందుబాటులో లేని సుందర్, టెస్టు సిరీస్ సమయానికైనా కోలుకుంటాడా? అనేది చూడాలి...
 

1123

ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న సమయంలో దీపక్ చాహార్‌ని గాయాలు వెంటాడుతున్నాయి. విండీస్‌తో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో ఓవర్ ఫినిష్ చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకున్నాడు దీపక్ చాహార్...

1223

తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడానికి తీవ్రతను బట్టి మూడు వారాల నుంచి 8 వారాల వరకూ సమయం పడుతుంది. దీపక్ చాహార్ గాయంతో ఐపీఎల్‌ 2022 సీజన్‌కి కూడా దూరమవుతాడని సమాచారం...

1323

నాలుగో స్థానంలో పర్ఫెక్ట్‌ బ్యాటర్‌గా సెటిలైన సూర్యకుమార్ యాదవ్, విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ గెలిచాడు...

1423

అయితే శ్రీలంకతో టీ20 సిరీస్‌కి ముందు సూర్యకుమార్ యాదవ్ గాయంతో తప్పుకున్నాడు. యాదవ్ ఎంట్రీ, టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్... ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటున్నాడు...

1523

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్, ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు భారతజట్టు...

1623

విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఆడిన రుతురాజ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడించాలని అనుకున్నా, అతను గాయపడి జట్టుకి దూరమయ్యాడు...

1723

టెస్టు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గాయపడి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టెస్టు సిరీస్ సమయానికి అశ్విన్ కోలుకుంటాడా? అనేది అనుమానంగా మారింది...

1823

ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా గాయపడిన భారత ఆటగాళ్ల లిస్టులో చేరాడు. లంకతో జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్‌ హెల్మెట్‌కి బంతి బలంగా తగిలింది... అతను ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది...

1923

ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గాయంతో ఐపీఎల్ 2020, ఆస్ట్రేలియా టూర్‌లకి దూరంగా ఉన్న రోహిత్, సౌతాఫ్రికా టూర్‌ ముందు గాయపడి ఫ్లైట్ ఎక్కనేలేదు...

2023

భారత జట్టులో ఏకంగా 7 ప్లేయర్లు గాయపడి, టీమ్‌కి దూరంగా ఉండడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఐపీఎల్ మెగా సీజన్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు గాయం పేరుతో జట్టుకి దూరంగా ఉండడంతో ఏదో జరుగుతోందని అనుమానిస్తున్నారు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Recommended image2
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Recommended image3
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved