కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత సెంచరీ.... అయినా రాయల్స్కి దక్కని విజయం...
ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్లాంటి మజాను అందించింది. తొలి ఇన్నింగ్స్లో క్రిస్గేల్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత మోగించగా... భారీ లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు...
ఆఖరి ఓవర్, ఆఖరి బంతిదాకా సాగిన మ్యాచ్లో చివరిదాకా నిలిచిన సంజూ శాంసన్, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 222 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్, 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల వద్ద నిలిచిపోయింది... పంజాబ్ కింగ్స్కి 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది.
222 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్కి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. షమీ వేసిన మొదటి ఓవర్లో బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యాడు...
వస్తూనే సిక్సర్తో ఐపీఎల్ కెరీర్ మొదలెట్టిన మనన్ వోహ్రా ఓ ఫోర్, ఓ సిక్సర్తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్..
రిలే మెడెరిత్ వేసిన ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదిన జోస్ బట్లర్... 13 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసి జే రిచర్డ్సన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్..
శివమ్ దూబే 15 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసి ఆర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
11 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసిన రియాన్ పరాగ్... షమీ బౌలింగ్లో కీపర్ కెఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
రాహుల్ తెవాటియా కూడా 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు... అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా బౌండరీలు మోగిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు సంజూ శాంసన్...
ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్గా మొదటి మ్యాచ్ ఆడుతూ సెంచరీ చేసుకున్న మొట్టమొదటి ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు సంజూ శాంసన్...
ఐపీఎల్ కెరీర్లో మూడో సెంచరీ పూర్తిచేసుకున్న సంజూ శాంసన్, విరాట్ కోహ్లీ (5 సెంచరీలు) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ప్లేయర్గా రెండో స్థానంలో నిలిచాడు...
వరాల్గా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఐదో స్థానంలో నిలిచాడు సంజూ శాంసన్... క్రిస్గేల్ 6, విరాట్ కోహ్లీ 5, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ నాలుగేసి సెంచరీలతో మూడో, నాలుగో స్థానంలో ఉండగా డివిల్లియర్స్తో కలిసి సంజూ శాంసన్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు...
2017, 2019 సీజన్లలో మొదటి సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచిన సంజూ శాంసన్, 2021 సీజన్లోనూ మొట్టమొదటి ఐపీఎల్ సెంచరీ బాదిన ప్లేయర్గా నిలిచాడు..
ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీయగా, మూడో బంతికి క్రిస్ మోరిస్ సింగిల్ తీశాడు.
నాలుగో బంతికి సిక్సర్ బాదిన సంజూ శాంసన్, ఐదో బంతికి సింగిల్ తీయడానికి ఇష్టపడలేదు. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు సంజూ శాంసన్...
63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఆఖరి ఓవర్ ఐదో బంతికి సింగిల్ లేదా రెండు పరుగులు తీసి ఉంటే ఫలితం మారిపోయి ఉండేది...