RR vs PBKS: రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ.. ప్లేఆఫ్ రేసులో పంజాబ్ కింగ్స్
IPL 2025 RR vs PBKS: ఐపీఎల్ 2025లో డూ ఆర్ డై మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ టీమ్ అద్భుత విజయం అందుకుంది. 10 పరుగుల తేడాతో రాజస్థాన్ పై పంజాబ్ గెలించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Shreyas Iyer. (Photo: PBKS Media)
IPL 2025 RR vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 59వ మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విక్టరీ కొట్టింది. దీంతో తన ప్లేఆఫ్స్ ఆశాలు సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కు ఆ జట్టు బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగులు వర్షం కురిపించారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ 219 పరుగులు చేసింది.
preity zinta pbks
పంజాబ్ బ్యాటర్లలో ప్రభు సిమ్రాన్ సింగ్ 21 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 30 పరుగులు చేశారు. నేహల్ వధేరా 70 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ను ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అలాగే, శశాంక్ సింగ్ 59 పరుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
220 పరుగులు భారీ టార్గెట్ లో రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ 50 పరుగుల ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. మరో యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో 40 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ధ్రువ్ జూరేల్ 53 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, మిగతా ప్లేయర్లు రాణించకపోవడం, కీలక సమయంలో వికెట్లు పడటంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో పంజాబ్ టీమ్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. పంజాబ్ టీమ్ 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరింది. ఆర్సీబీ టాప్ లో ఉంది. మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్, 4వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది.