- Home
- Sports
- Cricket
- 23 ఇన్నింగ్స్ల తర్వాత అర్థ శతకం.. మళ్లీ అగ్రస్థానానికి చేరిన టీమిండియా సారథి.. గప్తిల్తో పోరు తప్పేట్టు లేదు
23 ఇన్నింగ్స్ల తర్వాత అర్థ శతకం.. మళ్లీ అగ్రస్థానానికి చేరిన టీమిండియా సారథి.. గప్తిల్తో పోరు తప్పేట్టు లేదు
WI vs IND T20I: టీమిండియా సారథి రోహిత్ శర్మ నుంచి అగ్రస్థానాన్ని లాగేసుకున్న కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్.. రెండ్రోజులకే దానిని కోల్పోయాడు. విండీస్ తో తొల టీ20లో హిట్మ్యాన్ మళ్లీ తానే అగ్రస్థానానికి చేరాడు.

టీ20లలో అత్యధిక పరుగుల రికార్డు ఇద్దరు టాప్ బ్యాటర్ల మధ్య దోబూచులాడుతున్నది. ఇటీవలే రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి నెంబర్ వన్ స్థానాని చేరిన కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్.. రెండ్రోజులు కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదించకముందే రోహిత్ మళ్లీ దానిని లాగేసుకున్నాడు.
పొట్టి ఫార్మాట్ లో అత్యధిక పరుగుల రికార్డు గతంలో రోహిత్ పేరిటే ఉండేది. కానీ రెండ్రోజుల క్రితం స్కాట్లాండ్ తో జరిగిన తొలి టీ20లో గప్తిల్ ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గప్తిల్.. ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ కు ముందు 3,399 పరుగులతో అగ్రస్థానంలో ఉండేవాడు.
Rohit Sharma
కానీ ఈ మ్యాచ్ లో రోహిత్.. 44 బంతుల్లో 64 పరుగులు చేసి మళ్లీ ఆ అగ్రస్థానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తొలి టీ20లో 21 పరుగులు చేశాక రోహిత్.. గప్తిల్ ను అధిగమించాడు.
ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ శర్మ 129 మ్యాచులలో 3,443 పరుగులతో అగ్రస్థానాన్ని అధిష్టించగా.. 116 మ్యాచులలో 3,399 పరుగులతో గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గప్తిల్-రోహిత్ ల అగ్రస్థానం కొట్లాట మరికొన్ని రోజులు తప్పేట్టు లేదు. ఇరు జట్లు వీలైనన్ని ఎక్కువ టీ20లు ఆడనున్న నేపథ్యంలో ఈ ఇద్దరిమధ్య ఆధిపత్యం చేతులు మారనున్నది.
Image credit: Getty
ఇదిలాఉండగా ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా హిట్ మ్యాన్.. 23 ఇన్నింగ్స్ ల తర్వాత అర్థ సెంచరీ సాధించాడు. 2022లో రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ చేయలేదు. చివరిసారిగా అతడు.. టీ20 ప్రపంచకప్ ముగిశాక న్యూజిలాండ్ తో నవంబర్ లో చివరిసారి అర్థ శతకం బాదాడు.
ఆ తర్వాత వెస్టిండీస్ (3 మ్యాచులు), శ్రీలంక (3) సిరీస్ లతో పాటు ఐపీఎల్ లో 14 మ్యాచులు, ఇంగ్లాండ్ తో మూడు టీ20లలో రోహిత్ హాఫ్ సెంచరీ సాధించలేదు. ఈ ఏడాది టీ20 (అంతర్జాతీయ, ఐపీఎల్) లలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.