రోహిత్ శర్మ అవుట్... హాఫ్ సెంచరీ చేసి శుబ్మన్ గిల్ అవుట్... హజల్వుడ్కి 300వ వికెట్...
దాదాపు రెండు నెలల తర్వాత క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ... వస్తూనే బాగానే రాణించారు. భారీ అంచనాలతో బరిలో దిగిన రోహిత్ శర్మ, పెద్దగా పరుగులేమీ చేయకపోయినా మొదటి వికెట్కి అవసరమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 77 బంతుల్లో 26 పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ కాగా, యంగ్ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్, టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదుచేశాడు.
రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ కలిసి మొదటి వికెట్కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు... ఈ టెస్టు సిరీస్లో భారత జట్టు తరుపున మొదటి వికెట్కి ఇదే అత్యధిక భాగస్వామ్యం...
ఐపీఎల్లో గాయపడి టీ20, వన్డేలతో పాటు మొదటి రెండు టెస్టులకు దూరమైన రోహిత్ శర్మ, టీమిండియా ఇన్నింగ్స్లో మొదటి బంతిని ఫేస్ చేశాడు.
మొదటి బ్యాట్స్మెన్ నుంచి ఏడో నెంబర్ బ్యాట్స్మెన్ దాకా అన్ని స్థానాల్లో వన్డే, టీ20, టెస్టుల్లో బ్యాటింగ్ చేసిన రెండో క్రికెటర్గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు శ్రీలంక బ్యాట్స్మెన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.
నాథన్ లియాన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు...
ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 100 సిక్సర్లు బాదగా, ఇయాన్ మోర్గాన్ 63 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బ్రెండన్ మెక్కల్లమ్ 61, టెండూల్కర్ 60, ధోనీ 60 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ కలిసి 26 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. 2010లో సెంచూరియన్ టెస్టు మ్యాచ్ తర్వాత టీమిండియా తరుపున మొదటి వికెట్కి ఇదే అత్యధికం...
77 బంతులలో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 26 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జోష్ హజల్వుడ్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
జోష్ హజల్వుడ్కి ఇది 300వ వికెట్ కాగా... ఈరోజు అతని 30వ పుట్టినరోజు కావడం విశేషం...
ఆ తర్వాత 100 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు శుబ్మన్ గిల్... రెండో టెస్టు ఆడుతున్న గిల్కి ఇది కెరీర్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ స్కోరు...
21 ఏళ్ల 122 రోజుల వయసులో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ బాదిన గిల్, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన భారత ఓపెనర్గా నిలిచాడు...
అయితే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాతి బంతికే ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో కామెరూన్ గ్రీన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు శుబ్మన్ గిల్...
85 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజా, అజింకా రహానే క్రీజులో ఉన్నారు.