సిడ్నీ టెస్టులో ఓపెనర్గా రోహిత్ శర్మ... మయాంక్ అగర్వాల్ అవుట్... శుబ్మన్ గిల్తో కలిసి...
బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించినా... ఓపెనింగ్ వైఫల్యం భారత జట్టును వేధించింది. మొదటి టెస్టులో పృథ్వీషా ఘోరంగా ఫెయిల్ అయితే, రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఆసీస్ టూర్లో ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన మయాంక్ అగర్వాల్, సిడ్నీ టెస్టు మ్యాచులో తుది జట్టుకి దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
సిడ్నీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. యంగ్ ఓపెనర్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది...
కెఎల్ రాహుల్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకోవడంతో మిడిల్ ఆర్డర్లో హనుమ విహారికి మరో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది...
ఆసీస్ టూర్లో వరుసగా విఫలం అవుతున్న మయాంక్ అగర్వాల్కి సిడ్నీ టెస్టులో అవకాశం దొరకడం అనుమానమే...
అయితే భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాత్రం యంగ్ ఓపెనర్ శుబ్మన్ గిల్ను తప్పించి, మయాంక్ అగర్వాల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలని సూచించాడు.
‘గిల్కి పెద్దగా టెస్టులు అనుభవం లేదు... అతనితో కలిసి ఓపెనింగ్ చేస్తే రోహిత్ శర్మ భాగస్వామ్యం నిర్మించడానికి ఇబ్బంది పడొచ్చు. కాబట్టి అనుభవం ఉన్న మయాంక్ అగర్వాల్తో కలిసి ఓపెనింగ్ చేస్తే బెటర్’ అంటూ వ్యాఖ్యానించాడు ప్రజ్ఞాన్ ఓజా...
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా మాయంక్ అగర్వాల్, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేయాలని టీమిండియాకు సూచించాడు...
‘కెఎల్ రాహుల్ లేకపోవడం వల్ల భారత జట్టు ఓ మంచి బ్యాట్స్మెన్ను మిస్ కానుంది. కాబట్టి రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ కలిసి ఓపెనింగ్ చేయాలి...
సౌతాఫ్రికా సిరీస్లో ఓపెనర్గా నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. వన్డేల్లో ఓపెనర్గా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది... కాబట్టి రోహిత్ ఓపెనింగ్ చేస్తే మంచిది...’ అన్నాడు వీవీఎస్ లక్ష్మణ్.
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం హనుమ విహారిని తప్పించి, మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్ ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని సూచించాడు...
మయాంక్ అగర్వాల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలని సూచించిన సునీల్ గవాస్కర్, శుబ్మన్ గిల్ను మిడిల్ ఆర్డర్లో ఆడించాలని తెలిపాడు...