ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్కి రోహిత్ శర్మ... అయితే ఒక కండీషన్తో...
IPL 2020 సీజన్ మరో మూడు రోజుల్లో ముగియబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత భారీ షెడ్యూల్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టబోతోంది భారత జట్టు. ఈ సిరీస్లో రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎట్టకేలకు ఈ వివాదానికి ఓ ఫుల్స్టాప్ పెట్టబోతోంది బీసీసీఐ.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను నాలుగుసార్లు ఛాంపియన్గా నిలిపి, మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ కెప్టెన్గా నిలిచాడు రోహిత్ శర్మ...
ఈ 2020 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఫైనల్లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకోగా, సన్రైజర్స్ హైదరాబాద్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే రెండో క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో బరిలో దిగకపోవడం,అదే సమయంలో ఆసీస్ టూర్కి ఎంపిక చేసిన జట్టులో ‘హిట్ మ్యాన్’కి ప్లేస్ దక్కకపోవడం జరిగిపోయాయి.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు రోహిత్ శర్మ.
రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి, బీసీసీఐ ఫిజియో రోహిత్ శర్మ గాయాన్ని అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాటు గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కర్షన్ జరిగింది...
ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడగలిగినప్పుడు టీమిండియాకి ఆడలేడా అని సెలక్టర్ల విధానాన్ని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించగా... టీమిండియాకి ఆడడం కంటే రోహిత్ శర్మకి ఐపీఎల్లో ఆడడమే ముఖ్యమన్నట్టుగా ఉందని మరో మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ వ్యాఖ్యానించాడు.
రోహిత్ శర్మ గాయం గురించి క్లియర్ క్లారిటీ రాకపోయినా ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను పంపించాలని నిర్ణయం తీసుకుంది బీసీసఐ.
అయితే ముంబై ఇండియన్స్ ఆడే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ... బీసీసీఐ ఫిజియో, వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం గడపనున్నాడు...
రోహిత్ శర్మ గాయం తీవ్రతను గమనించిన తర్వాతే అతను ఆస్ట్రేలియా సిరీస్లో ఏ సిరీస్ ఆడాలనేది నిర్ణయిస్తారు సెలక్టర్లు.
వన్డే సిరీస్లో భాగం కాకపోయినా, ఆ తర్వాత జరిగే టీ20, టెస్టు సిరీస్ సమయానికి రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అంచనా వేస్తున్నారు బీసీసీఐ అధికారులు.