మళ్లీ బ్యాటు పడుతున్న సచిన్, సెహ్వాగ్, లారా... మార్చి 2 నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్...
మార్చి 2న రాయ్పూర్లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీ...
సచిన్, సెహ్వాగ్తో పాటు బరిలో ఐదు దేశాల సీనియర్ ప్లేయర్లు...
ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లెజెండ్స్ జట్లతో 20 రోజుల పాటు సిరీస్...
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్... క్రికెట్కి దూరమైన లెజెండ్ల ఆటను చూసేందుకు మరోసారి అదృష్టం దక్కనుంది.
కరోనా లాక్డౌన్ కారణంగా గత ఏడాది నిర్వహించాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ను వచ్చే నెలలో నిర్వహించాలని భావిస్తున్నారు నిర్వహికులు.
ఈ ఏడాది మార్చి 2న రాయ్పూర్లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ, మార్చి 21న ముగుస్తుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ను రిస్తే సినీ ప్లస్ ఛానెల్లో ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ సిరీస్లో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్తో పాటు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్, రోమేశ్ కులువితరణ, జహీర్ ఖాన్, చంద్రపాల్, యువరాజ్, బ్రెట్లీ, కైఫ్, ఓజా, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ పాల్గొనబోతున్నారు.
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సిరీస్కి కమిషనర్గా వ్యవహారించే ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ వ్యవహారిస్తున్నారు..
ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లెజెండ్స్ జట్ల సీనియర్లు ఈ టోర్నీలో పాల్గొంటారు.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జనాల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో మహారాష్ట్ర రోడ్ సేఫ్టీ సెల్ ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
దీనికి ఐసీసీ, బీసీసీఐ అనుమతి వచ్చినా కరోనా కారణంగా 2020లో టోర్నీ నిర్వహించడం వీలు కాలేదు...
శ్రీలంక జట్టులో ఆటపట్టు, కపుగెదర, రంగానా హేరత్, సనత్ జయసూర్య, ఆస్ట్రేలియా టీమ్లో బ్రాడ్ హాడిన్, బ్రాడ్ హాగ్, విండీస్ టీమ్లో కార్ల్ హూపర్, లారా, సౌతాఫ్రికా టీమ్లో గిబ్స్, మోర్కెల్ వంటి లెజెండరీ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు.