ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్ ఈ కుర్రాడే... మనోడి ఆస్తి ఎన్ని వేల కోట్లు ఉందో తెలిస్తే...
బిజినెస్ దిగ్గజం కుమార్ మంగళం బిర్లా వ్యాపార సామ్రాజ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరున్న డబ్బులతో చిన్నచిన్నదేశాలను ఈజీగా కొనేయగలరు. అలాంటి బిలియనీర్ కొడుకు మాత్రం క్రికెటర్ని అవుతా... అంటున్నాడు..
కుమార్ మంగళం బిర్లా కొడుకు ఆర్యమన్ బిర్లా... భారతదేశంలోనే అత్యంత సంపన్న క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బహుశా ప్రపంచంలోనే ధనిక క్రికెటర్ కూడా ఇతనేనేమో..
23 ఏళ్ల ఆర్యమన్ బిర్లా... ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టు తరుపున ఆడుతున్నాడు. 2017లో మధ్యప్రదేశ్ జట్టు తరుపున మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ఆర్యమన్ బిర్లా, 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే ఆ తర్వాత జరిగిన సీకే నాయుడు క్రికెట్ టోర్నీలో 11 ఇన్నింగ్స్ల్లో 795 పరుగులు చేసి అదరగొట్టాడు... చిన్ననాటి నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్న ఆర్యమన్ బిర్లా... టీమిండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు...
2018లో ఆర్యమన్ బిర్లాను రాజస్థాన్ రాయల్స్, రూ.31 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే చాలామంది కుర్రాళ్లలాగే ఈ ప్లేయర్కి కూడా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు...
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గానే కాకుండా ఆర్థోడాక్స్ బౌలర్గా కూడా రాణించగల ఆర్యమన్... కుటుంబ ప్రోత్సాహం, పేరు, పరపతి లేకుండా సొంత గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు..
దాదాపు రూ.70 వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆర్యమన్ బిర్లా... కోరుకునే ఓ ఐపీఎల్ టీమ్నే కొనుగోలు చేయగలడు. కానీ సొంత గుర్తింపు కోసం కఠినంగా శ్రమిస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆర్యమన్ బిర్లా...
ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్యమన్ బిర్లా...ఇటు క్రికెట్తో పాటు అటు తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన పనులతో కూడా బిజీగా ఉంటున్నాడు.
తండ్రి కుమార్ మంగళం బిర్లాతో కొడుకు ఆర్యమన్ బిర్లా...
భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్యమన్ బిర్లా...
స్టేడియంలో ప్రాక్టీస్కి ముందు ఆర్యమన్ బిర్లా...