RCB vs PBKS: విరాట్ కోహ్లీ సూపర్ నాక్.. పంజాబ్ అడ్డాలో ఆర్సీబీ విక్టరీ
RCB vs PBKS IPL 2025 : ఐపీఎల్ 2025 లో 37వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. 158 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 7 బంతులు మిగిలి ఉండగానే అందుకోవడంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నాక్ కీలకపాత్ర పోషించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
RCB vs PBKS IPL 2025: పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ కుదిగిన పంజాబ్ టీమ్ కు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 26 బంతుల్లో 42 పరుగులు కొట్టారు.
ప్రియాన్ష్ ఆర్య 22 పరుగులు, ప్రభసిమ్రన్ సింగ్ 33 పరుగులు చేసి ఔటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. ప్రియాన్ష్ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇద్దరూ కృనాల్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యారు. దీంతో పవర్ప్లేలో పంజాబ్ టీమ్ స్కోరు 60 పరుగులు దాటింది.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ మళ్ళీ నిరాశపరిచింది. అతను 6 పరుగులు చేసి రోమియో షెఫర్డ్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అతను ఔటైన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 68 పరుగుల వద్ద పంజాబ్ తన మూడో వికెట్ కోల్పోయింది.
ఒకానొక దశలో 76 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. నెహల్ వధేరా కూడా 5 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరూ కలిసి 26 బంతుల్లో 36 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ 17 బంతుల్లో 29 పరుగులు చేసి సుయష్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
చివరి ఓవర్లలో శశాంక్ సింగ్, మార్కో జెన్సెన్ కలిసి పరుగులు రాబట్టారు. శశాంక్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదిగా సాగింది. అతను 33 బంతుల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. జెన్సెన్ మాత్రం బ్యాట్తో చెలరేగాడు. 20 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ 157 పరుగులకు చేరుకుంది.
158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్ సాల్ట్ కేవలం 1 పరుగు చేసి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి ఓవర్ ఆరో బంతికే RCB తొలి వికెట్ కోల్పోయింది.
తొలి వికెట్ త్వరగా పడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ RCB ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు పంజాబ్ బౌలర్లను చుక్కలు చూపించారు. 69 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
లక్ష్య ఛేదనలో దేవదత్ పడిక్కల్ అర్ధశతకం సాధించాడు. అతను 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. దీంతో RCB ఛేదన సులువైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ నిరాశపరిచాడు. అతను 12 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. అయితే అతని వికెట్ పెద్దగా నష్టం కలిగించలేదు. అప్పటికే ఆర్సీబీ విజయానికి దగ్గరైంది.
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్
తొలి ఓవర్ నుంచి క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ అద్భుతమైన నాక్ ఆడాడు. హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. కోహ్లీ 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 73 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. 19వ ఓవర్ ఐదో బంతికి జితేష్ శర్మ సిక్సర్ తో ఆర్సీబీకి విన్నింగ్స్ రన్స్ కొట్టాడు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఐదో గెలుపు.
పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 157/6 పరుగులు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.5 ఓవర్లలో 159/3 పరుగులతో విజయాన్ని అందుకుంది.