- Home
- Sports
- Cricket
- IPL 2025 playoffs: ప్లేఆఫ్స్లోకి అధికారికంగా దూసుకొచ్చిన ఆర్సీబీ.. ఒక ప్లేస్ కోసం గట్టిపోటీ !
IPL 2025 playoffs: ప్లేఆఫ్స్లోకి అధికారికంగా దూసుకొచ్చిన ఆర్సీబీ.. ఒక ప్లేస్ కోసం గట్టిపోటీ !
RCB Officially Qualifies for IPL 2025 Playoffs: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది. ఎందుకంటే ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఆదివారం మూడు జట్ల ప్లేఆఫ్స్ స్థానాలు కన్ఫార్మ్ అయ్యాయి. మరో స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
RCB Officially Qualifies for IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ అభిమానుల ఆనందం వెల్లివిరుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు అధికారికంగా 2025 ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం వెలువడగానే ప్లేఆఫ్స్ స్థానాల చిత్రం దాదాపుగా స్పష్టమైంది. ఆర్సిబి ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకుంది.
ఐపీఎల్ 2025 మూడు జట్ల ప్లేఆఫ్స్ స్థానాలు ఖరారు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో పాటు మరో రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్తో పాటు పంజాబ్ కింగ్స్ కూడా ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
ఒక స్థానానికి మూడు జట్ల పోటీ
ప్లేఆఫ్స్లో మూడు స్థానాలు ఇప్పటికే ఖరారయ్యాయి. మిగిలిన ఒక స్థానానికి మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పుడు ప్లేఆఫ్స్ స్థానానికి పోటీ పడుతున్నాయి. వీటిలో ఒక జట్టుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన మూడు జట్లకు చెరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి పాయింట్ల పట్టికలో స్థానాలు మారవచ్చు. కానీ ప్లేఆఫ్స్ స్థానాలు ఖరారయ్యాయి.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన జట్లు ఇవే
ఈ సారి ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నాలుగు జట్లు అధికారికంగా నిష్క్రమించాయి. ఇక వీటికి ఓటమి తేడాను తగ్గించుకునే మార్గమే మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ధోని టీమ్ సీఎస్కే ఉంది. 12 మ్యాచ్లలో 3 విజయాలు సాధించి కేవలం 6 పాయింట్లు మాత్రమే సాధించింది.
ఆర్సీబీపై అంచనాలు రెట్టింపు
ఈ సారి ఐపీఎల్ టోర్నమెంట్లో కోహ్లీ టీమ్ ఆర్సీబీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. గత కొన్ని సీజన్లలో కూడా బెంగళూరు టీమ్ ఇలాంటి ప్రదర్శన ఇచ్చింది. కానీ ఈసారి టైటిల్ గెలుస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు బెంగళూరు జట్టు ప్రయత్నిస్తుంది.