అక్కడికెళ్లినందుకే రవిశాస్త్రికి కరోనా... హెడ్కోచ్తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా...
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడినట్టు తేలిన విషయం తెలిసిందే. రవిశాస్త్రితో పాటు భారత కోచింగ్ సిబ్బంది మరో ముగ్గురు కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్కి వెళ్లారు...
భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో కాంటాక్ట్ ఉన్న కారణంగా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్తో పాటు భారత ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటల్ కూడా ఐసోలేషన్కి వెళ్లారు...
ప్రస్తుతం భారత జట్టు, లండన్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏర్పాటుచేసిన బయో సెక్యూలర్ జోన్లోనే కుటుంబసభ్యులతో కలిసి బస చేస్తోంది. అలాంటిది రవిశాస్త్రికి వైరస్ ఎలా సోకిందనే కోణంలో ఈసీబీ అధికారులు దర్యాప్తు చేశారు...
సోమవారం ఉదయం నిర్వహించిన RT-PCR పరీక్షల్లో కూడా రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ రావడంతో 10 రోజుల పాటు ఐసోలేషన్లో తప్పనిసరిగా ఉండాలంటూ సూచించారు వైద్యులు...
ఈ కారణంగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి లేకుండానే బరిలో దిగనుంది.
బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉంటారా? లేదా? అనేది వారికి మరోసారి నిర్వహించే పరీక్షల రిజల్ట్ని బట్టి నిర్ణయించబడుతుంది...
రవిశాస్త్రి మంగళవారం రాత్రి ఇంగ్లాండ్లోని విక్టోరియా ఏరియాలో ఉన్న సెయింట్ జెమ్స్ కోర్ట్ హోటల్లో తన పుస్తక ఆవిష్కరణకు హాజరయ్యాడు. ఈ సభకు రవిశాస్త్రితో పాటు భారత సారథి విరాట్ కోహ్లీ మరికొందరు జట్టు సభ్యులు హాజరయ్యారు....
వీరెవ్వరూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఈ విషయం గురించి సమాచారం కూడా ఇవ్వలేదట. ఈ వేడుకకి చాలా మంది అతిథులు రావడంతో వారిలో ఎవరి ద్వారానైనా రవిశాస్త్రికి వైరస్ సోకి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు అధికారులు....
విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన ప్లేయర్లు అందరికీ నాలుగుసార్లు కరోనా పరీక్షలు చేసిన తర్వాత నాలుగో రోజు ఆటలో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది ఈసీబీ.
లండన్లో గత వారం రోజుల్లో 21 వేల కొత్త కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి పరిస్థితులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఇలా చెప్పాపెట్టుకుండా పార్టీలు, సమావేశలకు హాజరుకావడంపై విమర్శలు వస్తున్నాయి.