సంజూ శాంసన్కి కెప్టెన్సీ ఇవ్వడం, ఆ జట్టులో చాలామందికి ఇష్టం లేదు... వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్..
ఐపీఎల్ 2021 సీజన్లో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న ఇద్దరు యంగ్ టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లలో సంజూ శాంసన్ ఒకడు. గత ఏడాది టీమ్ పర్ఫామెన్స్ తర్వాత స్టీవ్ స్మిత్ను వేలానికి వదిలేసిన రాజస్థాన్ రాయల్స్, సంజూ శాంసన్ను కెప్టెన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది...
కెప్టెన్గా ఆడిన మొదటి మ్యాచ్లోనే అద్భుత సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ను విజయం దాకా తీసుకొచ్చాడు. అయితే ఆఖరి బంతికి సిక్సర్ కావాల్సిన దశలో అవుట్ కావడంతో మ్యాచ్లో విజయం దక్కలేదు.
సీజన్లో ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్ రాయల్స్, రెండు మ్యాచుల్లో విజయం దక్కించుకుంది. అయితే విజయాలు వస్తున్నా, రాజస్థాన్ జట్టులో ఏదో వెలితి... దానికి కారణం సంజూ శాంసన్కి కెప్టెన్సీ ఇవ్వడం ఆ జట్టులో చాలామందికి ఇష్టలేకపోవడమే అంటున్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
‘రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటతీరు చూస్తుంటే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సంజూ శాంసన్ ఓ వైపు ఉంటే, మిగిలిన జట్టు మొత్తం మరోవైపు ఉన్నట్టుంది. జట్టులో సరైన సఖ్యత లోపించింది...
రాజస్థాన్ రాయల్స్లో ఉన్న చాలామంది ప్లేయర్లు, సంజూ శాంసన్కి కెప్టెన్సీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సీజన్లో ఆర్ఆర్ ఆడుతున్న మ్యాచుల్లో క్లియర్గా కనిపిస్తోంది.
రిషబ్ పంత్తో పోలిస్తే సంజూ శాంసన్ కాస్త నెమ్మదస్తుడు. కెప్టెన్గా ప్లేయర్లపై ఆజమాయిషీ చేయలేడు. రిషబ్ పంత్ చాలా దూకుడుగా వ్యవహారిస్తున్నాడు..
వికెట్ల వెనకాల తన కామెంటరీతో బౌలర్లను ఉత్సాహపరిచే పంత్ వ్యక్తిత్వం కూడా అతనికి కలిసి వస్తోంది. సంజూ శాంసన్ అలా కాదు, వికెట్ల వెనకాల చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అదీకాకుండా జట్టులో ప్లేయర్ల నుంచి అతనికి సహకారం రావడం లేదు’ అంటూ అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
‘రాజస్థాన్ రాయల్స్లో 11 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఆ జట్టు ఆడుతున్నప్పుడు చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కనిపిస్తోంది. మొదటి మ్యాచ్లో క్రిస్ మోరిస్కి సింగిల్ ఇవ్వడానికి సంజూ శాంసన్ నిరాకరించడం జట్టులో ఈ మార్పుకి కారణం కావచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ ఓజా...
ఇప్పటికే బెన్ స్టోక్స్ గాయం కారణంగా మొదటి మ్యాచ్ తర్వాత జట్టుకి దూరం కావడం, జోఫ్రా ఆర్చర్ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకపోవడంతో బాగా నష్టపోయింది రాజస్థాన్ రాయల్స్...
తాజాగా లియామ్ లివింగ్స్టోన్, ఆండ్రూ టై వంటి ప్లేయర్లు అర్ధాంతరంగా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో నలుగురు ఫారిన్ ప్లేయర్లను మిస్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్.
క్రిస్ మోరిస్ బౌలింగ్ చేసేటప్పుడు సంజూ శాంసన్ రెస్పాండ్ అవుతున్న తీరు... శాంసన్ రెస్పాన్స్కి మోరిస్ స్పందిస్తున్న తీరు చూస్తే... జట్టులో లుకలుకలు నిజమేనని అనిపిస్తోంది.