రాహుల్ సార్, నాకేమీ చెప్పలేదు, ఆ గాయం కారణంగానే అవుట్ అయ్యా... పృథ్వీషా కామెంట్...
ఈ మధ్యకాలంలో పృథ్వీషా ఉన్న ఫామ్ చూస్తే, ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆస్ట్రేలియా టూర్లో ఆడిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమైన పృథ్వీషా... ఆ పరాభవం తర్వాత మరో కొత్త ప్లేయర్గా కనిపిస్తున్నాడు...
ఆడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ క్లీన్ బౌల్డ్ అయిన పృథ్వీషాని తీసి పక్కనబెట్టింది టీమిండియా...
ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్లో జరిగిన మూడు టెస్టు మ్యాచుల్లో అవకాశం దక్కించుకోలేకపోయిన పృథ్వీషా, ఇంగ్లాండ్ సిరీస్కి కూడా ఎంపిక కాలేదు. ఒకే ఒక్క టెస్టు తర్వాత తనని తీసి పక్కనబెట్టేశారనే కసి కనిపించేలా తన ఆటతీరును మార్చుకున్నాడు పృథ్వీషా...
విజయ్ హాజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలు, 800లకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన పృథ్వీషా, ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్లోనూ క్లాస్ షాట్స్తో తనలోని మాస్ను టీమిండియాకి చూపించాడు...
కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో శివమ్ మావి బౌలింగ్లో వరుసగా ఆరుకి ఆరు ఫోర్లు బాదిన పృథ్వీషా, శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలోనూ చూడచక్కని షాట్లతో క్రికెట్ ఫ్యాన్స్ని కన్నులవిందు చేశాడు...
ఇన్నింగ్స్ రెండో బంతికే ఫోర్ బాది, ఖాతా తెరిచిన పృథ్వీషా, ఆ తర్వాతి బంతికే మరో బౌండరీ రాబట్టాడు. ఉదాన బౌలింగ్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన పృథ్వీషా... క్రీజుకి అన్ని వైపులా కళాత్మక షాట్లతో ఆకట్టుకున్నాడు.
ఈ కారణంగానే 86 పరుగులు చేసిన శిఖర్ ధావన్ని కాదని, 59 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ని కూడా పక్కనబెట్టి 43 పరుగులు చేసిన పృథ్వీషాని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంచుకున్నారు...
‘నేను బ్యాటింగ్కి వచ్చేటప్పుడు రాహుల్ సర్, నాకేమీ చెప్పలేదు. నేను ఒక బ్యాట్స్మెన్ బౌండరీలు కొట్టాలనే ఆలోచనతోనే క్రీజులోకి అడుగుపెట్టాను.
స్కోరుబోర్డును పరుగులు పెట్టించాలనేదే నా టార్గెట్. పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తోంది. అదీకాకుండా నాకు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా ఇష్టం...
అయితే నేను అవుటైన విధానం నాకు నచ్చలేదు. చమీరా వేసిన బాల్, చాలా బలంగా హెల్మెట్కి తగిలింది. ఆ గాయం తర్వాత కాస్త ఫోకస్ కోల్పోయి, రాంగ్ షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యా...’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీషా...