అరుదైన రికార్డు సృష్టించిన పృథ్వీషా ... గౌతమ్ గంభీర్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో...
పృథ్వీషా ఏం చేసినా అది సెన్సేషనే అవుతోంది. విజయ్ హాజారే ట్రోఫీ, ఐపీఎల్, వన్డే సిరీస్లో అదరగొట్టిన పృథ్వీషా... శ్రీలంకతో మ్యాచ్ ద్వారా టీ20ల్లో ఆరంగ్రేటం చేశాడు. అయితే ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు పృథ్వీషా..
ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న పృథ్వీషా, ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ తర్వాత ఆరంగ్రేటం మ్యాచ్లో డకౌట్ అయిన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు పృథ్వీషా...
ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆరంగ్రేటం చేసిన పృథ్వీషా... ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. అతిపిన్న వయసులో మూడు ఫార్మాట్లు ఆడిన భారత బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు పృథ్వీషా...
2016లో జింబాబ్వేపై తొలి టీ20 ఆడుతూ డకౌట్ అయిన కెఎల్ రాహుల్, వన్డేల్లో మొదటి మ్యాచ్లో సెంచరీ చేయగా, పృథ్వీషా టెస్టుల్లో సెంచరీతో ఎంట్రీ ఇచ్చి టీ20ల్లో డకౌట్ కావడం విశేషం.
21 ఏళ్ల 258 రోజుల వయసులో టీ20ల్లో ఓపెనింగ్ చేసిన యంగెస్ట్ భారత ఓపెనర్గా నిలిచాడు పృథ్వీషా.
షా వికెట్ తీసిన దుస్మంత ఛమీరా, భారత్పై టీ20ల్లో మొదటి బంతికే వికెట్ తీసిన మొట్టమొదటి బౌలర్గా రికార్డు సృష్టించాడు.
టీ20 ఫార్మాట్లో భారత జట్టుకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు శిఖర్ ధావన్. 35 ఏళ్ల 232 రోజుల వయసులో కెప్టెన్సీ చేపట్టిన ధావన్, 35 ఏళ్ల 52 రోజుల ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించాడు.
34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మొదటి మూడు టీ20 ఇన్నింగ్స్ల తర్వాత 100+ పరుగులు చేసిన రెండో భారత ప్లేయర్గా నిలిచాడు.
ఇంతకుముందు గౌతమ్ గంభీర్109 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 139 పరుగులు చేసి అతన్ని అధిగమించాడు. మొదటి మూడు టీ20 ఇన్నింగ్స్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్లు కూడా గౌతీ, సూర్యనే కావడం విశేషం.
టీ20 కెప్టెన్గా మొదటి మ్యాచ్లోనే అత్యధిక స్కోరు చేసిన భారత సారథిగా శిఖర్ ధావన్ టాప్లో నిలిచాడు. శిఖర్ ధావన్ 46 పరుగులు చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ 34, అజింకా రహానే 33 పరుగులు చేశారు.